Friday 4 April 2014

వేస‌వి చ‌ల్ల చ‌ల్లా‌గా తాగేయండి !

- ఆమ్‌ కా పన్నా
2 పెద్ద పచ్చి మామిడి కాయలు
2 టీస్పూన్ల జీలకర్ర పొడి
1 టీస్పూన్‌ మిరియాల పొడి
నల్ల ఉప్పు
ఒక చిటికెడు ఇంగువ
పావు కప్పు పంచదార
తయారీ విధానం
మామిడికాయలు కడిగి ముక్కలు చేసి ఉడికించాలి. చల్లబడిన తర్వాత తొక్కు తీయాలి. ముక్కలను చిదిమి పేస్ట్‌ లాగా చేయాలి.
జీలకర్ర పొడి, మిరియాల పొడి, నల్ల ఉప్పు, ఇంగువ, పంచదార ఆ పేస్ట్‌కి కలపాలి. అందులో పంచదార కరిగేవరకు కలపాలి. ఆ పేస్ట్‌ని ఒక గ్లాసుకి ఒక చెంచా చొప్పున వేసి అందులో గ్లాసు నిండా చల్లని నీరు పోస్తే ఆమ్‌ కా పన్నా తయారు
వేసవిలో దాహం తీరడానికి ఎక్కువ నీరు తాగడంతో పాటు ద్రవ పదార్థాలనూ తీసుకుంటూ ఉండాలి. మనకు అందుబాటులో ఉన్న వస్తువులతో ఇంట్లోనే రకరకాల రుచికరమైన, పోషకాలు కలిగిన డ్రింక్‌లు చేసుకోవచ్చు.
-జల్‌జీరా
పుదీనా ఆకులు పావు కప్పు
కొత్తిమీర పావు కప్పు
అల్లం ముక్క
జీలకర్ర 2 టీస్పూన్లు
పంచదార 3 టీస్పూన్లు
ఆమ్‌చూర్‌ పౌడర్‌ పావు టీ స్పూన్‌
చాట్‌ మసాలా చిటికెడు
రాళ్ళ ఉప్పు కొద్దిగా
నిమ్మరసం 2 టీస్పూన్లు
నీరు 4 కప్పులు
తయారీ విధానం
నీరు, నిమ్మరసం తప్ప మిగిలిన పదార్థాలన్నీ మిక్సీలో వేసి తిప్పి పేస్ట్‌ చేయాలి. జల్లెడలో వేసి వడకట్టాలి. దానికి నిమ్మరసం చేర్చాలి. తర్వాత 4 కప్పుల నీరు, ఐసు ముక్కలు కలిపి, పైన బూందీ వేయాలి.
-బాదం పాలు
-బాదం పాలు
4 కప్పుల పాలు
పావు కప్పు బాదం పప్పు
ఒక చిటికెడు యాలకుల పొడి
3,4 టీస్పూన్‌ల తేనె
తయారీ విధానం
బాదంపప్పులు వేడినీటిలో రెండు నిమిషాలు నానబెట్టి, తొక్కు తీసి దంచాలి. అడుగు మందం ఉన్న గిన్నెలో పాలు కాచి అందులో బాదం పప్పు పొడిని వేసి ఇరవై నిమిషాలు మరగనివ్వాలి. యాలకుల పొడి వేసి మరి కొంతసేపు మరగనివ్వాలి. మంట మీద నుంచి దించి తేనె కలిపి తిప్పాలి. గోరువెచ్చగా కాని, ఫ్రిజ్‌లో ఉంచి చల్లగా గాని తీసుకోవచ్చు.
-రండాయి
ఒక కప్పు పాలు, ఒకటిన్నర కప్పు పంచదార, పావు కప్పు ఎండబెట్టిన గులాబీ రేకులు, ఒకటిన్నర లీటర్ల నీరు, ఒక టీస్పూన్‌ బాదంపప్పు
ఒక టీస్పూన్‌ జీడిపప్పు
అర టీస్పూన్‌ గసగసాలు
అర టీస్పూన్‌ సోంప్‌
అర టీస్పూన్‌ యాలకుల పొడి
అర టీస్పూన్‌ రోజ్‌ వాటర్‌
తయారీ విధానం
అర లీటరు నీటిలో పంచదార వేసి కరిగించాలి. ఇతర వస్తువులను మిగిలిన నీటిలో నానబెట్టాలి. అన్నీ మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్‌లాగా చేయాలి. తీత పేస్ట్‌ను నానబెట్టిన నీటిలో వేసి కలపాలి. ఈ నీటిని ఒక గిన్నెకి మస్లిన్‌
బట్ట కట్టి వడబోయాలి. ఆ పేస్ట్‌కి మరికాస్త నీరు పోసి పిండితే పూర్తిగా రసం బైటికి వచ్చేస్తుంది. దానికి పాలు, పంచదార, రోజ్‌ వాటర్‌ కలపాలి. దానికి యాలకుల పొడి కలిపి తాగే ముందు ఐసు ముక్కలు వేయాలి.
-లస్సీ
2 కప్పుల తాజా పెరుగు
1 టీస్పూన్‌ పంచదార
అర టీస్పూన్‌ యాలకుల పొడి
8 నుంచి 10 మిల్లీ గ్రాముల కుంకుమపువ్వు
2 చుక్కల వెనీలా ఎసెన్స్‌
ఐస్‌ ముక్కలు
ఒక టీ స్పూన్‌ పాలు
తయారీ విధానం
కుంకుమపువ్వు 1 టీ స్పూన్‌ వేడిపాలలో కరిగించాలి.
పెరుగులో పంచదార వేసి కరిగేవరకు మిక్సీలో తిప్పాలి.
తర్వాత అందులో మిగిలిన వస్తువులు కూడా వేసి తిప్పాలి. తాగేముందు ఐసు ముక్కలు వేయాలి.
-మసాలా మిల్క్‌
4 గ్లాసుల పాలు
2 టీస్పూన్‌ల జీడిపప్పు
2 టీస్పూన్‌ల బాదంపప్పు
2 టీస్పూన్‌ల పిస్తా
పావు టీ స్పూన్‌ యాలకుల పొడి
1టీస్పూన్‌ క్రీమ్‌
ఒక చిటికెడు కుంకుమపువ్వు
4 టీస్పూన్‌ల పంచదార
తయారీ విధానం
జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా, యాలుకలు, పంచదార, కుంకుమపువ్వు కలిపి మిక్సీకి వేయాలి. మెత్తగా అయిన ఆ పొడిని పాలకు కలపాలి. దానికి క్రీమ్‌ను చేర్చి బాగా గిలకొట్టాలి. దానికి పాలను కలిపి ఫ్రిజ్‌లో ఉంచి 3 గంటల వరకు చల్లబరచాలి.

 Courtesy with: PRAJA SEKTHY DAILY 

No comments:

Post a Comment