Tuesday 28 February 2012

E-mails not all that ‘green'

D. BALASUBRAMANIAN

Share  ·   print   ·   T+  
Costly infrastructure: The use of personal computers, servers, storage centres cost energy and hence more CO {-2} emission. — photo: AFP
Costly infrastructure: The use of personal computers, servers, storage centres cost energy and hence more CO {-2} emission. — photo: AFP
During Deepavali time, these days, we are inundated with electronic greeting cards, and we too send several such e-cards ourselves. We believe that by switching from paper to electronic mode of communications, we are “green”, and that in doing so we have saved paper and thus done a bit to save the environment and generate less CO {-2}.
Well, perhaps just a bit but it appears not as much as we are led to believe. “E-mails are not so green” reports a news item in a recent issue of the journal Science .
The often-quoted estimate by Mr. Matthew Yeager of Computacentre (Europe's largest IT infrastructure company) claims that sending an e-mail attachment of 4.7 megabytes (MB) creates as much greenhouse gas as boiling a tea-kettle 17.5 times.
His study claims that an e-mail of 1 MB would be the equivalent to the emission of 19 grams of CO {-2} {-.} And if that mail is copied (cc'd, as we type) to 10 people, its impact is 73 grams of CO {-2} {-.}
Well, I was astonished to read this, since I too believed that I was saving the planet a bit by using my PC to communicate with people, instead of “snail mail”.
Keira Butler explains the matter in an issue of the magazine The Atlantic (August 12, 2010). She says “Say you send a picture to 20 people by email.
Each one has to download it. That means the use of equipment such as personal computers, servers, storage centres (not to mention printers for hard copy, if used)”. All these cost energy and hence more CO {-2} emission.
It is a matter of scale. Matthew Yeager points out that the current amount of data storage across the globe is 1.2 zettabytes (ZB) of stored data. This requires equipment with a mass equivalent of 20 per cent of the island of Manhattan, New York City! Put another way, this level of stored data is the equivalent of all of the US' academic libraries multiplied by half a million! And the data storage is expected, by the year 2020, to grow to 35 ZB (incidentally, zetta is a sextillion, or 10 raised to the power 21 (or 1 followed by 21 zeros).
The scale increases thousand-fold each time from million or mega, to billion (giga), trillion (tera), quadrillion (peta), quintillion (exa), sextillion (zetta), septillion (yotta) and so forth).
E-mail is thus not all that green. And e-mails with attachments are worse. Yeager estimates that in a 100-people company where each employee sends on average 33 e-mails a day and receives 58, the greenhouse gas emission linked to emails would be around 13.6 tons of CO {-2} per year.
And a study by the French government's Environment and Energy Management Agency (Ademe) suggests that if each of these 100 employees sent 10 per cent less emails for a year, they would save CO {-2} emissions equivalent to one round-trip flight between Paris and New York.
Talking of CO {-2} emissions by airline traffic, I was reminded of what Dr. Jeremy Nathans of Johns Hopkins wrote to me (by e-mail, not snail-mail) when we invited him to come to Hyderabad for delivering the Champalimaud Lecture in 2009.
He declined coming in person, stating that he is doing his bit to the environment by not flying all the way from Baltimore and back. We had him lecture electronically (video talk real time; I should now estimate how much CO {-2} he would have saved by not flying but video-lecturing).
To get an estimate of how much power is consumed by electronic communication, go to the website < http://whatsthisgottodowithstoragefiles.wordpress.com/2010/08/wired-uk-july-2009-internet-electricity.pdf >.
They point out that 30 per cent of the input power in each computer is used in powering the chips, 30 per cent of the energy entering a microprocessor is turned into heat, and that 123 billion kilowatt hour (kwh) per year is how much electricity it takes just to keep the Internet's servers running.
And traditional IT environments, says Yeager, tend not to be overly efficient in scale. Traditional infrastructure — server plus storage plus network plus operating system plus application — all lead to wastage in efficiency. Combine this with what Keira Butter points out in The Atlantic , you get an idea of how much energy is lost in electronic communications. Yes, e-communication does save trees, is more efficient and produces less CO{-2}than paper-based communication. But the scale of it is what needs to be kept in mind.
Take Facebook usage. It is estimated that its users alone are uploading over 1000 photos per second, or 3 billion photos per month. Recall the tea kettle boiling equivalent of sending a 4.7 MB attachment, and you get the idea.
What should we do?
So what should we do? There are several ways of saving energy and cutting down greenhouse gas from our end. First, free up the memory space in the computer. Clean up the e-mail box (in and out mails) periodically. Not doing these means greater demand for storage and energy used by that storage.
Second, limit the number of recipients for each e-mail (cut down the number of cc's to).
Third, cut down the size of the attachments (boil less tea- water).
Fourth: enter the URL address directly rather than use a search engine. Cut down the times you “Google”, “Yahoo” etc.
Fifth: don't leave your computer and accessories on overnight (as many offices do), not even on ‘ sleep mode' (even if that eats up only 1-10 watts).
Sixth: laptops use 15-60 watts while desktops use 250W. Cut down the power by doing more ‘offline' work than online. Finally, remember Facebooking and Twittering burn carbon and make CO {-2}. Talk more and twitter less!
D. BALASUBRAMANIAN
dbala@lvpei.org

The Hindu and Ramanujan


The Hindu followed the mathematical career of Ramanujan in detail and highlighted his genius, especially from early 1914.

Image: 1 of  5
                                                                                                                                   
The first reference occurs in a letter to the Editor titled ‘A Missing Boy’, published on September 6, 1905 in the newspaper, which was a triweekly at the time. The letter, from J. Seenivasa Raghava Ayangar, appeals for the public’s help in tracing “a Brahmin boy of the Vaishnava (Thengalai) sect, named Ramanujam, of fair complexion and aged about 18 years” who had “left his home on some misunderstanding.”
The first reference occurs in a letter to the Editor titled ‘A Missing Boy’, published on September 6, 1905 in the newspaper, which was a triweekly at the time. The letter, from J. Seenivasa Raghava Ayangar, appeals for the public’s help in tracing “a Brahmin boy of the Vaishnava (Thengalai) sect, named Ramanujam, of fair complexion and aged about 18 years” who had “left his home on some misunderstanding.”

Monday 27 February 2012

జ్వరం మీటరుతో జర జాగ్రత్త


ఇది వరకు జ్వరం చూసుకోవాలంటే డాక్టరు దగ్గరికి పరుగెత్తాల్సి వచ్చేది. కాని ఇప్పుడు ఇంట్లోనే ధర్మామీటరు పెట్టుకుని జ్వర తీవ్రతను తెలుసుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉంది కాని ధర్మామీటరు పొరపాటున చేయిజారి కిందపడితేనే ఇబ్బంది. ఎందుకంటే ఇందులో ఉండే మెర్క్యురీ అంటే పాదరసం పర్యావరణంతో పాటు మీ ఆరోగ్యానికి కూడా చేటు తెచ్చి పెడుతుంది అంటున్నారు నిపుణులు. ఒకవేళ పొరపాటున మీ చేతి నుంచి ధర్మామీటరు జారి కింద పడి పగిలిపోతే ఏమి చేయాలో, ఏమి చేయకూడదో కూడా చెప్తున్నారు వాళ్లు.

చేయకూడనివి... * చీపురు లేదా వాక్యూమ్ క్లీనర్‌లతో శుభ్రం చేయకూడదు. * పాదరసం పడిన నేలపై నడవకూడదు. ఒకవేళ కాలికి ఉన్న చెప్పులకు పాదరసం అంటుకుంటే ఆ చెప్పులు వెంటనే వదిలేయాలి. * పాదరసాన్ని డ్రైయినేజిలో పోయొద్దు. అలా పోస్తే డ్రెయిన్ మూసుకుపోతుంది. సెప్టిక్ ట్యాంక్ కలుషితమయిపోతుంది. * పాదరసం పడిన గదిలో ఎవరినీ ఉంచొద్దు. ముఖ్యంగా పిల్లలు, పెంపుడు జంతువులు ఉంటే వెంటనే గది బయటకు పంపి గది మూసేయాలి. పాదరసం అంటిన బట్టల్ని, వస్తువుల్ని ముట్టుకోవద్దు.

చేయాల్సినవి... మెర్క్యురీని శుభ్రం చేసే వస్తువులు కిట్‌లా లభిస్తాయి. ఒకవేళ అలా లభించకపోతే విడివిడిగా ఆ వస్తువులను మీరే కొనుక్కోవచ్చు. లాటెక్స్ గ్లౌజులు, ట్రాష్ బ్యాగ్‌లు, జిప్ లాక్ బ్యాగ్‌లు, పేపర్ టవల్, కార్డ్‌బోర్డ్, ఐడ్రాపర్, షేవింగ్ క్రీమ్, చిన్న బ్రష్, ఫ్లాష్ లైట్, సల్ఫర్ పొడి (ఇది అవసరమనుకుంటేనే) కొనండి.

శుభ్రం చేయడం ఇలా... పాదరసం పడిన వెంటనే కాకుండా పావుగంట తరువాత శుభ్రం చేయాలి. అలాగే ఆ గది తప్ప మిగతా గది తలుపులన్నీ మూసేయాలి. గాజు ముక్కల్ని గ్లౌజులు వేసుకున్న చేతులతో కాగితపు టవల్ మీదకి తీసుకోవాలి. ఈ టవల్‌ను వెంటనే జిప్ లాక్ బ్యాగ్‌లో పడేయాలి. తరువాత నేలపైన ఇంకా ముక్కలేవైనా ఉన్నాయేమో గమనించండి. ఒకవేళ కరెంటు బల్బు కాంతిలో కనిపించకపోతే గదిలో లైట్లు ఆపేసి ష్లాష్ లైట్ వెలుగులో చూడాలి. చిన్న చిన్న ముక్కలు కనిపిస్తే వాటిని ఐ డ్రాపర్‌తో తీసి తడి పేపర్ టవల్ మీద వేయాలి.

దాన్ని కూడా జిప్‌లాక్ బ్యాగ్‌లో ఉంచాలి. ఆ తరువాత కొద్దిగా షేవింగ్ క్రీమ్‌ను బ్రష్ మీద వేసి కంటికి కనిపించని చిన్న చిన్న గాజు ముక్కల్ని తీసేయాలి. శుభ్ర పరచడానికి వాడిన వస్తువులన్నిటినీ ట్రాష్‌బ్యాగ్‌లో వేయాలి. ఈ బ్యాగ్‌ను బయో హజార్డస్ వేస్ట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి లేదా మునిసిపాలిటీలో వ్యర్థాల వ్యవహారాలను చూసే విభాగంలో ఇవ్వాలి. గదిని శుభ్రం చేసిన తరువాత 24 గంటల పాటు గాలి వెలుతురు వచ్చేలా ఉంచాలి. ఆ తరువాతే వాడాలి.

ఇంత శుభ్రం ఎందుకంటే... పాదరసం విడుదలయిన గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తులు విషమయం అవుతాయి. దృష్టిలోపం, శరీర కదలికల్లో ఇబ్బంది, నరాలకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ఎక్కువ మోతాదులో పాదరసాన్ని పీల్చితే చనిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకని పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకోక తప్పదు. మెర్క్యురీ ధర్మామీటర్లు కాకుండా డిజిటల్ ధర్మామీటర్లు కూడా మార్కెట్లో లభిస్తున్నాయి ఈ మధ్య. వీలయితే వాటిని ఉపయోగించొచ్చు.

Sunday 26 February 2012

నేడు ఖగోళ అద్భుతం

నేడు ఖగోళ అద్భుతం


  • 27/02/2012
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ఆకాశంలో సోమవారం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఒకేసారి నాలుగు గ్రహాలు ఖగోళ వీక్షకులకు కనువిందు చేయనున్నాయి. భూమినుంచి చూస్తే బృహస్పతి, చంద్రుడు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తాయని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఎన్ రఘునందన్ చెప్పారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం అయితే దీన్ని బృహస్పతి చంద్రుడితో కలవడంగా చెప్తారు. అయితే ఖగోళ శాస్త్ర ప్రకారం భూమినుంచి చూసినప్పుడు ఈ రెండుగ్రహాలు ఒకదానికి మరొకటి చాలా దగ్గరగా ఉన్నట్టు కనిపిస్తాయని ఆయన చెప్పారు. సోమవారం రాత్రి పది గంటల సమయంలో ఆకాశంలో పశ్చిమ దిక్కులో బృహస్పతి గ్రహాన్ని చూడవచ్చని ఆయన చెప్పారు. భూమికి సహజ ఉప గ్రహమైన చంద్రుడికి దిగువగా పశ్చిమ దిశగా శుక్రగ్రహాన్ని కూడా చూడవచ్చని ఆయన చెప్పారు. బృహస్పతి, శుక్రుడు, నెలవంక మూడూ వరసగా ఆకాశంలో పశ్చిమ వైపున సాయంకాలపు నీరెండ వెలుగులో త్రికోణాకారంలో కనిపిస్తాయని ఆయన చెప్పారు. ఇవి మూడు చాలా ప్రకాశవంతంగా ఉంటాయి గనుక నగర విద్యుద్దీపాల వెలుగులో సైతం వీటిని చూడడానికి వీలవుతుందని ఆయన చెప్పారు. సూర్యాస్తమయం తర్వాత శనిగ్రహం కూడా ఆకాశంలో తూర్పు వైపున కనిపిస్తుందని ఆయన చెప్పారు. మార్చినెల 14న శుక్రుడు, బృహస్పతికి దగ్గరవడం సంభవిస్తుందని, అప్పుడు ఈ రెండు గ్రహాలు ఆకాశంలో జంటగా, ఒకదాని పక్కన ఒకటి కనిపిస్తాయని రఘునందన్ చెప్పారు.

Wednesday 22 February 2012

కళ్లు అదరడం-అశాస్త్రీయం

ప్రజాశక్తి :విజ్ఞాన వీచిక డెస్క్    Wed, 31 Mar 2010, IST  
ఆడవాళ్లకు ఎడమకన్ను, మగవాళ్లకు కుడికన్ను అదిరితే మంచిదని, అందుకు భిన్నంగా అదిరితే దురదృష్టమని అంటారు. నాకు కూడా అనుభవంలో అలాగే జరిగింది. ఇది వాస్తవమేనా?
- బి. మల్లీశ్వరి, దాచేపల్లి, గుంటూరుజిల్లా.
ఎడమ, కుడి, కళ్లు అదరడం, ఆడ, మగ ఇవన్నీ వాస్తవాలు. అదృష్టం, దురదృష్టం మిథ్యా పదాలు. వాటికి అర్థంపర్థం లేదు. కష్టం, లాభం, సామాజికపుటంశాలు. సంబంధం, సహేతుకం, అస్తిత్వంపరంగా వైవిధ్యం ఉండే పలు అంశాల్ని ఒకే గాటనగట్టి కలగాపులగంగా కలపడం అవివేకం. ఎక్కడో కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ధూమకేతువు (తోకచుక్క(comet)) కనిపిస్తే అది గ్రామానికో, దేశానికో అశుభ సూచకం అని నమ్మేరోజులు పాతకాలంలోవి. అయినా తోకచుక్కలకు, అర్థంపర్థంలేని అశుభం, శుభాలకు లంకె పెట్టే మూఢనమ్మకం నేటికీ ప్రజల్లో కొనసాగుతోంది. అలాగే ఎన్నో వందల కాంతి సంవత్సరాల దూరం (కాంతి సెకనుకు సుమారు 3 లక్షల కి.మీ. వేగంతో వెళితే ఒక సంవత్సరంలో కాంతి ప్రయాణించే దూరాన్ని ఓ కాంతి సంవత్సరం, light year, అంటారు.) లో ఉన్న నక్షత్రరాశుల భంగిమకు, ఇక్కడ భూమ్మీద ఉన్న మనుషుల కష్టనష్టాలకు, ఉద్యోగసద్యోగాలకు, పెళ్లిళ్లు పెటాకులకు, విదేశీ ప్రయాణాలకు లింకుపెట్టే జ్యోతిష్యశ్శాస్త్రము ఓ కుహనా శాస్త్రమే అయినా ప్రజల్లో చాలామంది వేలం వెర్రిగా రాశిఫలాలను నమ్ముతున్నారు. ఎందరో మేధో సోమరులు ఆ మూఢనమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. అంతకన్నా ఘోరమైన విషయం ఈ ఎడమకన్ను, కుడి కన్ను అదరడాలను ఆడామగా లైంగికత్వపు లక్షణాలతో కలగలిపి, వాస్తవదూరాలైనా అదృష్ట, దురదృష్ట మసాలాలను దట్టించి, ప్రజల కష్టాలనెత్తిన పులమడం.

బాగా నిద్రపోయి, సరైన విశ్రాంతి తీసుకుంటే కన్ను అదరడాలు ఉండవు. పరీక్షల మూలానో, ఇంట్లో కార్యక్రమాల వల్లనో, మరేదైనా వృత్తిపరమైన వత్తిళ్ల వల్లనో అడపదడపా మనకు సరిపడా నిద్ర లభించకపోవచ్చు. అంటే కంటి రెప్పల్ని అదే పనిగా తెరిచే ఉంచాల్సిన అగత్యం లేదా కంటికి విశ్రాంతినివ్వకుండా కనురెప్పల్ని పదేపదే ఆర్పాల్సిన అవసరం పరిమితిని మించిన స్థితి తటస్థ పడిందన్నమాట. లేదా పరీక్షల కోసం అదేపనిగా చదువుతుండడం వల్లనో, కంప్యూటర్‌ మానిటర్‌ దగ్గర ఎక్కువసేపు పనిచేయడం వల్లనో, సన్నని అక్షరాలను కష్టపడి చదవవలసిన పరిస్థితి రావడంవల్లనో కంటికి శ్రమ అధికం కావచ్చును. అటువంటి పరిస్థితుల్లో కంటి కదలికలను కలిగించే కండరాలను నియంత్రించే మెదడు భాగాలు బాగా అలసిపోయి ఇబ్బందిపడతాయి. దీన్నే ఫ్యాటిగ్‌ (fatigue) అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కంటి కండరాలను నియంత్రించే మెదడు యంత్రాంగం కొద్దిగా గతి తప్పి, లయ తప్పిన సంకేతాల (arrtythematic impulses) ను కండరాలకు అందిస్తుంది. ఆ సమయంలో కంటి కండరాలు స్వల్పంగా అదరడం సంభవిస్తుంది. ఇది కేవలం అరుదైన, అసాధారణమైన విషయం కాబట్టి, ఏదో ఒక కన్ను కండరాలు మాత్రమే కదుల్తాయి. ఒకోసారి ఈ పరిస్థితి కుడికన్నుకు రావచ్చును. మరోసారి ఎడమకన్నుకు కలగవచ్చును. అలసిపోవడం, మెదడు పనిచేసే విధానం, కంటిచూపు యంత్రాం గం, కంటి కదలికల యంత్రాంగం లైంగిక భేదాలకు సంబంధించిన అంశం కాదు. కాబట్టి ఆడవారికైనా, మగవారికైనా కన్ను అదరడం మామూలే. ఒక్కోసారి నరాల బలహీనత ఉన్నవారికి, మెదడులో ఏదైనా సమస్యలు ఉన్నవారికి కూడా తరచూ కన్ను అదరడం సాధారణం.

కాబట్టి కన్ను అదరడం అన్న విషయం పూర్తిగా జీవ భౌతికచర్య (physiological action). కేవలం x, y క్రోమోజోముల ప్రభావంతో దేహంలో కలిగే లైంగిక అంశాలైన వక్షం, గడ్డం, మీసం, గొంతు ధ్వని, జననాంగాలు (genetalia), మొదలైనవాటిని మినహాయిస్తే మిగిలిన జీవప్రక్రియలన్నింటినీ (కన్ను అదరడంతో పాటు) స్త్రీపురుషులిరువురిలోనూ ఒకే విధమైన యంత్రాంగం నిర్దేశిస్తుంది. కాబట్టి ప్రాథమికంగా చూసినా కుడికన్ను మగవారికి, ఎడమకన్ను ఆడవారికి అదరడాన్ని లైంగికపుటంశంగా పరిగణించడం అశాస్త్రీయం. అసంబద్ధం. నిర్హేతుకం; కన్ను అదరడం ప్రమాదంలేని అవాంఛనీయమైన నాడీ ప్రక్రియ కాబట్టి లింగమేదైనా (ఆడైనా, మగైనా) అది కుడికన్నయినా, ఎడమకన్నయినా యంత్రాంగం ఒకటే. ఒకవేళ కన్ను అదరడం మంచిది కాదనుకుంటే అది ఏ కన్ను అదిరినా మంచిది కాదు. ఎడమ కన్ను అదిరితే ఆమోదయోగ్యంగానూ, కుడికన్ను అదిరితే ఆమోదరహితంగానూ లెక్కగట్టకూడదు. కన్ను అదరడం మంచిది కాదనుకుంటే ఆడవారికి అదిరినా, మగవారికి అదిరినా ఒకే విధమైన దృక్కోణంతో చూడాలి. శుభము, అశుభము, అదృష్టము, దురదృష్టము కేవలం కాల్పనిక మిథ్యార్థ (abstract) పదాలు. ఒకవేళ వాటిని మనం ఆనవాయితీగా కష్టంలేని పరిస్థితులను శుభం లేదా అదృష్టం అనీ, కష్టమైన పరిస్థితుల్ని అశుభం లేదా దురదృష్టము అని సర్దుకున్నా వాటికి సాపేక్షత (relative)ను ఆపాదించి చూస్తాము. కోట్లు దండుకొనే పెట్టుబడిదారుడికి ఓరోజు ఉన్నట్టుండి తాత్కాలికంగా ఓ లక్షరూపాయలు నష్టం కలిగితే అతనికి కష్టం వచ్చినట్లు, అతనికి అశుభం జరిగినట్లు వాళ్ల ఇంటిల్లిపాదీ భావిస్తారు.

'గరకునేలపై గురకలు వినరా' అంటూ ప్లాట్‌ఫారం మీద పడుకొని నిద్రించే పేదవాడి చితికిన బతుకుల్ని అదృష్టంగా చలామణీ చేసిన చాతుర్యం గల కవులకు ధనికుల ఇళ్లలో పరిమిత లాభాలే నష్టాలుగా కన్పిస్తాయి. 'కుడి కన్ను అదిరింది కుర్రోడా' అంటూ అశాస్త్రీయపుటంశాలను వల్లెవేస్తూ సామాజిక కర్తవ్యాలను విస్మరించే నేపథ్యరంగాల నేపథ్యంలో కళ్లు అదిరిపోయే కుళ్లు ఉంటుంది. ఇప్పటికీ భ్రూణ హత్యలు, గృహహింస, ఆర్థిక వివక్ష, విద్యా వివక్ష, పాలనా వివక్ష, సామాజిక వివక్ష, సాంస్కృతిక వివక్ష మొదలైన ఎన్నో వివక్షలకు లోనవుతున్న మహిళల కన్ను అదరడాల్లో కూడా మగవారితో సారూప్యత లేకుండా వివక్ష చూపుతున్నారు. ఆడవారికి కుడికన్ను అదిరితే అశుభమట. ఉత్తుత్తి అంశాల్లో కూడా ఆడవారికి తక్కువ హోదా (ఎడమవైపు) ఉంటేనే మంచిదట. ఎక్కువ హోదా (కుడివైపు) ఉన్నవన్నీ మగవారికే మంచివట. మీ కన్ను అదరడానికి, మీకు అనుభవంలోకి వచ్చిన శుభాఅశుభాలకు లంకె పెట్టడం పైవిధంగా చూస్తే అశాస్త్రీయం. నాకు జ్వరమొచ్చినప్పుడు రోడ్డు మీద ఆగి ఉన్న ఆర్టీసీ బస్సులో నల్లప్యాంట్‌ వ్యక్తి బస్సెక్కాడనుకుందాం. ఇక దానర్థం రోడ్డు మీద ఆర్టీసీ బస్సులో నల్లప్యాంట్‌ వాడు ఎక్కితే ఇంట్లో ఉన్న నాకు జ్వరమొచ్చిందని అనుకోవడం ఎంత అశాస్త్రీయమో మీ కన్ను అదరడానికీ మీకు కలిగిన శుభాఅశ భాలకు లింకు పెట్టడం కూడా అంతే అశాస్త్రీయం. ప్రజల కష్టనష్టాలకు కళ్లు అదరడానికి ఏమాత్రం శాస్త్రీయ ఆధారం లేదు. అలా ఉందనుకోడం పూర్తిగా అవాస్తవం.

టీకా మందులు

ప్రజాశక్తి :విజ్ఞాన వీచిక డెస్క్    Wed, 31 Mar 2010, IST  
''చికిత్సకన్నా రోగనిరోధకం ఎంతో మేలు'' అనేది నానుడి. వ్యాధి వచ్చిన తర్వాత ఎంతో బాధపడి.. ఖరీదుతో చికిత్స చేయించుకునేదానికన్నా అతి కొద్ది ఖర్చుతో రోగ నిరోధకం కల్పించే 'టీకా'లను వేయించుకుంటే ఎంతో ఉత్తమమని ఈ నానుడి అర్థం. దాదాపు పిల్లలందరికీ ఇప్పుడు టీకాలను పుట్టినప్పటినుండే ఇస్తున్నాం. టీకాలంటే హాని చేయని రోగకారక సూక్ష్మజీవులను శరీరంలోకి చొప్పించి, (ఇంజెక్షన్లు, నోటిలో వేసే చుక్కలు, ఇతరత్రా) రోగ నిరోధక శక్తిని కలిగించడమే. అందువల్ల, ఈ టీకాల ప్రయోజనం గురించి తెలుసుకోవాలి. ఇదే ఈనాటి 'విజ్ఞానవీచిక' లక్ష్యం.రోగ
నిరోధక వ్యవస్థ....
సూక్ష్మజీవులైన బ్యాక్టీరియా, వైరస్‌లు దాడి చేసి, మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు వ్యాధి వస్తుంది. ఈ సూక్ష్మజీవులు శరీరంలోకి ప్రవేశించగానే ఈ జీవుల ఉపరితలానికి అతుక్కుని ఉన్న 'యాంటీజెన్స్‌' సహాయంతో రోగనిరోధక వ్యవస్థ ఈ వ్యాధి కారక సూక్ష్మజీవులను గుర్తించగలదు. దీనికి ప్రతిస్పందనగా సూక్ష్మజీవుల యాంటీజెన్స్‌ శక్తిని నిర్వీర్యం చేయడానికి రోగనిరోధకశక్తిగల యాంటీబాడీలను ఉత్పత్తి చేసి, శరీరంలో వ్యాధి రాకుండా చేస్తుంది. ఏదైనా ఒక రోగానికి ఒకసారి యాంటీబాడీలు ఏర్పడ్డ తర్వాత, అదే రోగ క్రిములు శరీరంలోకి ప్రవేశించినపుడు యాంటీబాడీలు పునరుత్పత్తయ్యి యాంటీజెమ్‌లను నిర్వీర్యం చేసి, శరీరాన్ని రోగం నుండి కాపాడతాయి. ఇలాంటి రోగ నిరోధకశక్తిని 'చురుకైన రోగ నిరోధకశక్తి' (యాక్టివ్‌ ఇమ్యునైజేషన్‌) గా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి రోగ నిరోధకశక్తి దీర్ఘకాలం ఉంటుంది.
ఒకవేళ ఇప్పటికే రోగనిరోధకశక్తి గల జీవాల నుండి యాంటీబాడీలను సేకరించి, ఇతర జీవాలకు ఎక్కించినప్పుడు కలిగే రోగనిరోధకశక్తి తాత్కాలికంగా కొన్ని వారాలకే పరిమితమవుతుంది.
రోగ నిరోధకశక్తిని కల్పించడంలో వివిధ శరీరభాగాలు (బొమ్మలో వివరించినట్లు) ఇమిడి ఉన్నాయి. 'థైమస్‌' (గ్రంథి) రోగ నిరోధశక్తి అభివృద్ధికి తోడ్పడుతుంది. తెల్లరక్తకణాలు దాడి చేస్తున్న రోగ సూక్ష్మజీవులను ఎదుర్కోవడానికి యాంటీబాడీలను తయారుచేస్తాయి. ఎముకల్లో ఉన్న 'గుజ్జు' తెల్లరక్త కణాలను తయారుచేస్తుంది. 'లింఫ్‌ నోడులు' వ్యాధికారక బ్యాక్టీరియాలను తొలగించడానికి తోడ్పడటమేకాక, యాంటీబాడీలను, తెల్లరక్త కణాలను తయారుచేస్తాయి. 'స్ల్పీన్‌' గ్రంథి రక్తాన్ని శుభ్రపరుస్తుంది. యాంటీబాడీలను కూడా తయారుచేస్తుంది.
క్యాన్సర్‌...
కొంత 'కణ సమూహం' ఏ అదుపూ లేకుండా మామూలుకన్నా ఎక్కువగా విభజనకు గురవు తుంది. దీనికి గల నిర్ధిష్ట కారణాలు ఇప్పటికీ చెప్పలేకపోతున్న ప్రజారోగ్యంలో దీనికి అత్యధిక ప్రాధాన్యత ఉంది. ఫలితంగా, చుట్టుపక్కల భాగాలపై దాడిచేస్తూ ఈ కణ సమూహం పెరుగుతుంది. ఇతర శరీర భాగాలకు కూడా లింఫ్‌ గ్రంథుల ద్వారా లేదా రక్తం ద్వారా వ్యాపిస్తుంది. ఈ మూడురకాలు నొప్పిలేని కణతులను (బినైన్‌ ట్యూమర్స్‌) గుర్తించవచ్చు. ఇదే క్యాన్సర్‌. ఒక్క లుకేమియాకు (రక్త కణాలకు వచ్చే క్యాన్సర్‌) తప్ప, మిగతా అన్నిరకాల క్యాన్సర్‌లలో ట్యూమర్లు (గడ్డలు) ఏర్పడతాయి. కేన్సర్‌ అధ్యయనం, నిర్ధారణ, చికిత్స, చదివే వైద్య భాగాన్ని 'అంకాలజీ' అని పిలుస్తారు.
అన్ని వయస్సుల వారికీ క్యాన్సర్‌ రావచ్చు. పొగాకు, అణుశక్తి, రసాయనాలు, అంటువ్యాధులను కలిగించే కొన్ని సూక్ష్మజీవులు క్యాన్సర్‌ వ్యాధిని కలిగించవచ్చు. వీటిని కార్సినోజెన్స్‌ (క్యాన్సర్‌ కారకాలు) అంటారు. 'డిఎన్‌ఎ' వృద్ధి, విభజన సమయంలో వచ్చే అనుకోని, అసాధారణ మార్పుల వల్ల, లేదా వారసత్వం వల్ల క్యాన్సర్‌ రావచ్చు. క్యాన్సర్‌ రోగ నిర్ధారణను బయాప్సీ (బతికి ఉన్న జీవకణాలను మైక్రోస్కోపుతో పరిశీలన) ద్వారా తెలుసుకుంటారు. మమోగ్రఫీతో రొమ్ము క్యాన్సర్‌ను, మలంలోని రక్తకణాలను, కొలోన్‌ ద్వారా కోలోన్‌ను పరీక్షించి క్యాన్సర్‌ను నిర్ధారించవచ్చు. పురుష జననేంద్రియాలకూ ఈ క్యాన్సర్‌ రావచ్చు. పురుషుల్లో ఎక్కువగా ప్రొస్టేట్‌ గ్రంథి క్యాన్సర్‌ వస్తుంది. బయాప్సీ పరీక్ష ద్వారా దీనిని నిర్ధారించవచ్చు. ఎన్నోరకాల చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. క్యాన్సర్‌ వచ్చే శరీరభాగం మీద, వ్యాధిస్థాయి మీద క్యాన్సర్‌ వ్యాధి నయం కావడం ఆధారపడి ఉంటుంది.
క్యాన్సర్‌ వ్యాధిని ఇపుడు ఆధునిక రసాయన మందులతో, రేడియేషన్‌ పద్ధతి ద్వారా చికిత్స చేయవచ్చు. ఆపరేషన్‌ చేసి కూడా కణిత లేదా గడ్డ వచ్చిన భాగాన్ని పూర్తిగా తొలగించవచ్చు. కానీ ఇలా తొలగించే సమయంలో ఒక్క కణాన్ని వదిలిపెట్టకూడదు. పది బిలియన్‌ కణాలలో పది క్యాన్సర్‌ కణాలు మిగిలి ఉన్నప్పటికీ క్యాన్సర్‌ వ్యాధి పునరావృతం అవుతుంది.
క్యాన్సర్‌ వ్యాధుల్లో 30 శాతం పైగా జబ్బులను జాగ్రత్తలు తీసుకొని నివారించవచ్చు. ముఖ్యంగా, పొగాకు తీసుకోకుండా, ఊబకాయాన్ని నివారించి లేదా భౌతిక శ్రమశక్తి ద్వారా, పండ్లు-కూరగాయలు ఎక్కువగా తీసుకొని, సెక్స్‌ విషయంలో వ్యక్తిగత నీతి, నియమాలు పాటిస్తూ, గాలి కాలుష్యాన్ని నివారించడం ద్వారా క్యాన్సర్‌ను నివారించవచ్చు.
'మానవ (హ్యూమన్‌) పాపిల్లోమా వైరస్‌'తో స్త్రీ జననేంద్రియ క్యాన్సర్‌ను, మెదడు క్యాన్సర్‌ను (బ్రెయిన్‌ ప్యాపిల్లోమా వైరస్‌) అంటువ్యాధి కారకాల వల్ల నిరోధించవచ్చు. అంటువ్యాధి కారకాల వల్ల (వైరస్‌) వచ్చే క్యాన్సర్‌ను కూడా ఈ టీకా మందు నిరోధిస్తుంది. లివర్‌ క్యాన్సర్‌ను హెపటైటిస్‌ బి, సి-టీకాల ద్వారా నివారించవచ్చు. గార్డాసిల్‌ అనే మానవ పాపిల్లోమా వైరస్‌ టీకా మందుతో 70శాతం వరకూ వ్యాధిని తగ్గించవచ్చు. అయితే ఈ టీకా మందును జబ్బు రాక ముందే వేయాలి. ఒకసారి జబ్బు మొదలైన తర్వాత టీకా వేస్తే పనిచేయదు.
వివిధ వ్యాధులకు..
క్షయ వ్యాధి - బిసిజి; డిఫ్తీరియా, టెటనస్‌, కోరింత దగ్గు - డిటి డబ్ల్యుపి.
డిఫ్తీరియా, టెటనస్‌ - డిటి; టెటనస్‌-టిటి; హెపటైటిస్‌(కామెర్లు)-హెపటైటిస్‌ బి;
పొంగు, తట్టు (మీజిల్స్‌, రూబెల్లా) - ఎంఎంఆర్‌;
న్యూమోనియా (ఊపిరితిత్తుల వ్యాధి), మెదడువాపు వ్యాధి - హెచ్‌ఐబి
పోలియో - ఐపివి; టెటనస్‌, డిఫ్తీరియా (గవదబిళ్లలు) - టిడి.
సర్వైకల్‌ క్యాన్సర్‌-హెచ్‌పివి(గార్డాసిల్‌,సర్వారిక్స్‌);న్యూమోనియా-పిసివి7,పిపివి23
- డా|| సిహెచ్‌. శారద, జన విజ్ఞాన వేదిక

వైరస్‌లు...

ప్రజాశక్తి :విజ్ఞాన వీచిక డెస్క్    Wed, 31 Mar 2010, IST  
ఇవి ఒకరకమైన సూక్ష్మజీవులు. స్వయంగా పునరుత్పత్తి కాలేవు. కానీ, ఏదైనా జీవకణంలోకి ప్రవేశించినపుడు పునరుత్పత్తి కాగలవు. వీటిలో పునరుత్పత్తికి అవసరమయ్యే పదార్థం (డిఎన్‌ఎ) చుట్టూ మాంసకృత్తుల పూత ఉంటుంది. జీవకణంలో ప్రవేశించి, కేంద్రకంలోకి వెళ్లిన తర్వాత ఇవి పునరుత్పత్తిని ప్రారంభిస్తాయి. కేంద్రకంలోకి ప్రవేశించిన తర్వాత వైరస్‌ కాపీలు జీవకణం పగిలేంతవరకూ తయారవుతూనే ఉంటాయి. ఇలా జీవకణం పగిలి, విడుదలైన వైరస్‌లు ఇతర జీవకణాలను దాడి చేసి లోపలికి ప్రవేశించి, పునరుత్పత్తిని కొనసాగిస్తాయి. ఈ ప్రక్రియతో వ్యాధి వస్తుంది. కణతులు లేదా గడ్డలు ఏర్పడతాయి. బ్యాక్టీరియాల మాదిరిగా వైరస్‌లను యాంటీబయాటిక్‌ మందులు చంపలేవు. కానీ, వైరస్‌ వ్యాధుల వ్యాప్తిని నిరోధించడానికి ఇటీవల టీకా మందులు వచ్చాయి. బలహీనంగా ఉన్న రోగ సూక్ష్మజీవుల నుండి టీకా మందులను తయారు చేస్తు న్నారు. అప్పుడు యాంటీబాడీలు శరీరంలోనే ఉత్పత్తవుతాయి. వైరస్‌ రోగ వ్యాప్తి నివా రణకు 'గార్డాసిల్‌, సర్వారిక్స్‌ టీకా మందులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. వీటిని 'మానవ పాపిలోమా వైరస్‌ (హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌)' టీకాలు అంటారు. జలుబు చేసిన సమయంలో వైరస్‌లు దాడి చేసి వ్యాధిని కలిగించవచ్చు. జలుబు ఇబ్బందిని కలిగించినప్పటికీ ఇది తీవ్రమైన వ్యాధి కాదు. జలుబు ముట్టుకోవడం ద్వారా మాత్రమే వ్యాపిస్తుంది. దగ్గడం, తుమ్మడం ద్వారా వ్యాపించదు. జలుబుకు మందు లేదు. రెండొందలకన్నా ఎక్కువ వైరస్‌లు జలుబును కలిగిస్తున్నాయి. జలుబు వచ్చి నప్పుడు ఏ మందు తీసుకోకున్నా మన శరీరంలోనే యాంటీబాడీలు ఉత్పత్తయ్యి వారంరోజుల్లో తగ్గిపోతుంది.

లూయీ పాశ్చర్‌

ప్రజాశక్తి :విజ్ఞాన వీచిక డెస్క్    Wed, 31 Mar 2010, IST  
మానవాళికి మేలు చేసిన అతి గొప్ప శాస్త్రజ్ఞుల్లో లూయీపాశ్చర్‌ మొదటి వరుసలో ఉంటాడు. ఈయన ఫ్రాన్స్‌ దేశస్థుడు. 1882-95 మధ్య జీవించాడు. ఈయన పరిశోధనా ఫలితాల వల్ల ప్రతిరోజూ ప్రతిఒక్కరూ ఏదో రూపంలో లాభం పొందుతూనే ఉన్నారు. మొట్ట మొదట వ్యాక్సిన్‌ను తయారుచేసింది ఈయనే. రాబిస్‌, ఆంథ్రాక్స్‌, మశూచి, కలరా వంటి ప్రమాదకర జబ్బుల కారకాలను కనుగొని, వ్యాక్సిన్‌లను తయారుచేశాడు. ఆధునిక జీవశాస్త్రానికి, బయోకెమిస్ట్రీకి పునాది ఏర్పరిచాడు. పులియటంలో గల శాస్త్రీయతను కనుగొని, వైన్‌, బీర్‌లాంటి పానీయాల తయారీకి మార్గం చూపాడు. ఈయన పరిశోధనలు విజ్ఞానశాస్త్రం పలుదిశల్లో విస్తరణకు తోడ్పడ్డాయి.
ఈయన కనిపెట్టిన సూక్ష్మజీవుల సిద్ధాంతం (జర్మ్‌ థియరీ) ఆధారంగా నేడు మనం పాలను సురక్షితంగా (పాశ్చరైజ్‌ చేసి) వాడుకుంటున్నాం. జర్మ్‌ థియరీ ద్వారా అంటురోగాలకు సంబంధించిన కారకాలను కనుగొని, నియంత్రించడానికి తోడ్ప డింది. శస్త్రచికిత్స ఇతరత్రా సమయాల్లో ఇన్‌ఫెక్షన్‌ రాకుండా ఆధునిక జాగ్రత్తలు తీసుకొనేందుకు ఈయన కనిపెట్టిన శాస్త్ర విజ్ఞానమే తోడ్పడుతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఈయన పరిశోధనల ఫలితాలను వ్యాక్సినేషన్‌, ఫర్మింటేషన్‌, పాశ్చరైజేషన్‌ (కాచి, చల్లార్చడం)తో నిత్యజీవితంలో మానవాళి పలు ప్రయోజనాలు పొందుతోంది.

పిరమిడ్స్‌ ఎలా నిర్మించారు? అందుకు ఉపయోగించిన రసాయన పదార్థం ఏమిటి?

విజ్ఞాన వీచిక డెస్క్   Wed, 10 Mar 2010, IST  

భారీ యంత్రాలు, టెక్నాలజీ లేని కాలంలో ఈజిప్టు పిరమిడ్స్‌ను ఎలా నిర్మించారు ? పిరిమిడ్స్‌ నిర్మాణంలో వాడిన మోర్టార్‌ (సిమెంట్‌ లాంటి జిగురు పదార్థం) ఏ తరహా రసాయన పదార్థం ?
- ప్రత్యూష, విజయవాడ, కృష్ణాజిల్లా.
ఈజిప్టు దేశంలో ఉన్న పిరమిడ్లు ప్రాచీన ప్రపంచ నాగరికతకు దర్పణం పట్టిన అత్యంత ప్రాముఖ్యతగల నిర్మాణాలు. అయితే ఇవి కళలకుగానీ కళాపోషణకు గానీ సంబంధించిన కట్టడాలు కావు. దాదాపు 138 విడివిడి పిరమిడ్లను సుమారు 850 సంవత్సరాలపాటు వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు కాలాల్లో నిర్మించారు. క్రీ.పూ. 2630 (క్రీ.పూ.27వ శతాబ్దం)లో మొదటి పిరమిడ్‌ను నిర్మాణం చేశారు. క్రీ.పూ. 2611 సంవత్సరం వరకు దీని నిర్మాణం పూర్తయింది. అంటే దాదాపు 20 సంవత్సరాల పాటు సుమారు 20 వేల మంది శ్రామికులు చెమటోడ్చి పనిచేయడం వల్ల ఈ నిర్మాణాలు పూర్తయ్యాయి. ఆఖరి పిరమిడ్‌ను క్రీ.పూ.1814 సంవత్సరంలో పూర్తి చేశారని చరిత్ర పరిశోధకులు భావిస్తున్నారు.
కైరో నగరానికి సుమారు 50 కి.మీ. దూరంలో ఉన్న సక్కారా ప్రాంతంలో ప్రారంభించి దాదాపు 200 కి.మీ. వరకు విస్తరించిన హవారా ప్రాంతం వరకూ వివిధకాలాల్లో ఈ పిరమిడ్లను నిర్మించారు. ఈ 138 పిరమిడ్లలో నేడు చాలా కూలిపోయి నేలమట్టమయ్యాయి. కేవలం పునాదుల అవశేషాల ఆధారంగా, మిగిలిన పిరమిడ్ల నమూనాల కనుగుణంగా లెక్కించి 138 పిరమిడ్లుగా గుర్తిస్తున్నారు. ఇపుడు వివిధ అవసానదశల్లో 30 వరకు పిరమిడ్లను గుర్తిస్తున్నా పూర్తిరూపంలో ఉన్నవి కేవలం 8 మాత్రమే! ఇందులో క్రీ.పూ. 2550 సంవత్సరంలో గిజా ప్రాంతంలో నిర్మించిన గ్రేట్‌ పిరమిడ్‌ సుమారు 150 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఆధునిక ప్రపంచంలో ఉన్న కట్టడాలను పక్కనబెడితే 20వ శతాబ్దాంతం వరకు లెక్కిస్తే మానవ నిర్మిత నాగరిక కట్టడాలలో గ్రేట్‌ పిరమిడ్‌ అత్యంత ఎత్తయిన కట్టడం.

పిరమిడ్లు నిజానికి ఆనాటి కాలాల్లో అశాస్త్రీయ ఛాందసభావాలతో విరాజిల్లుతున్న పాలకుల సమాధులు. ఈ పాలకుల్ని ఫారోలు (pharaos) అంటారు. ఉదాహరణకు తొలి పిరమిడ్‌ను జోసర్‌ అనే అనే ఫారోకు సమాధిగా కట్టారు. దీనిని సక్కారా ప్రాంతంలో నిర్మించారు. గ్రేట్‌ పిరమిడ్‌ను క్రీ.పూ.2530 సంవత్సరంలో గిజా ప్రాంతంలో ఖాఫెర్‌ అనే ఫారోకు సమాధిగా నిర్మించారు. చివరి పిరమిడ్‌ను మూడవ అమ్మెన్‌ మాట్‌ సమాధిగా హవారాలో క్రీ.పూ.1860లో ప్రారంభించి సుమారు 50 సంవత్సరాలకు పూర్తి చేశారు. పిరమిడ్లు అంటేనే గణితం ప్రకారం బహుభుజ ఆధారపీఠం ఉన్న శంఖాకృతులు. అంటే ఆధారపీఠం (base) త్రికోణాకృతి (trigonal)తో గానీ, చతురస్రాకారం (tetragonal)లో గానీ ఉండడం ఆనవాయితి. పార్శ్వభాగాలు ఆధారపీఠంలోని ప్రతి భుజం నుంచి కూచీగా బయలుదేరి పైభాగాన కూచాగ్రం (apex) దగ్గర కలుస్తాయి. అంటే ప్రతి పార్శ్వపు గోడ (side wall) సమద్విబాహు త్రిభుజాకృతి (isosceles triangle) లో ఉంటాయన్నమాట. క్రమంగా పైకెళుతున్న కొద్దీ అడ్డుకోత(transverse cross-section) వైశాల్యం తగ్గుతూ ఉండడం వల్ల పైభాగాన ఉన్న బరువును కింద భాగంలో ఉన్న ఆధారం స్థిరంగా ఉంచుతుంది. స్థిరమైన త్రిమితీయ ఘన ఆకృతు (3-dimensional solid objects) లలో పిరమిడ్లు ప్రముఖమైనవి.
ఈజిప్టు పిరమిడ్‌ ఏదీ పూర్తిగా ఘనరూపం కాదు. మధ్యలో నిలువుగా సన్నని (పిరమిడ్‌ సైజుతో పోల్చుకొంటే) గుహలాంటిది ఉంటుంది. పిరమిడ్‌ పార్శ్వగోడల నుంచి ఒకటి రెండుచోట్ల ఈ గుహలోకి నాళికల్లాంటి దారులు(tunnels) ఉంటాయి. సాధారణంగా ఇవి కిందివైపు మెట్లతో (దిగుడుబావిలోకి దిగినట్లుగా) ఉంటాయి. అక్కడక్కడా అవి మధ్య గుహలోకి వెళ్లాక అక్కడ విశాలమైన ప్రాంతంలోకి తెరుచుకుంటాయి.

ఇదే చోటికి మెట్లులేని గొట్టాల ద్వారా పిరమిడ్‌ పక్కగోడలకు దారులు ఉంటాయి. ఇవి గాలిని లోనికి పంపి బయట, లోపల సమాన వాయుపీడనం (air pressure) ఉండేలా చేస్తాయి. గరిమనాభి (centre of gravity) నుంచి కిందివైపునకు నిలువుగా గీచిన ఊహారేఖ ఆధారపీఠం గుండా వెళ్లినట్లయితే ఆ వస్తువు పడిపోదనీ, ఆ గీత ఆధారపీఠం నుంచి పూర్తిగా ఒకవైపునకు విడిగా వెళితేనే వస్తువు పడిపోతుందనీ మనం పాఠశాల స్థాయిలో నేర్చుకున్నాము. ఈ సూత్రం ఆధారంగా ఒక వస్తువు మీద మరో వస్తువును ఉంచడానికి ఎలాంటి జిగురు, సిమెంటు అవసరం లేదు. మనం గ్రంథాలయంలో 20 పుస్తకాలను ఒకదానిమీద ఒకటిగా పేర్చామనుకోండి. అవి పడిపోకుండా ఉంచాలంటే విడిగా వాటిని కట్టాలనిగానీ, పుస్తకానికీ పుస్తకానికీ మధ్య జిగురు పెట్టాలన్న నిబంధనగానీ లేదు కదా! పటంలో చూపిన నిర్మాణాన్ని ఎ, బి, సి, డి, ఇ, ఎఫ్‌, జెడ్‌ అనే బండలతో నిర్మించితే అది పడిపోదు. ఈ బండల మధ్య సిమెంటు లేకున్నా అది స్థిరంగా ఉంటుంది. బి, సి, డి బండల మధ్య ఉన్న సందులో ఏవైనా బొమ్మల్ని, శవపేటికల్ని ఉంచగలము. కొన్ని వేలమంది కార్మికులు కొన్ని దశాబ్దాల పాటు శ్రమిస్తూ, ఏనుగులు, గుర్రాలను వాడుకొంటే పిరమిడ్ల నిర్మాణం రాజులకు సులభమే! ఈ సందర్భంగా శ్రీశ్రీ రచించిన దేశచరిత్రలోని
తాజమహల్‌ నిర్మాణానికి
రాళ్లెత్తిన కూలీలెవ్వరు?
సామ్రాజ్యపు దండయాత్రలో
సామాన్యుల సాహసమెట్టిది?
ప్రభువెక్కిన పల్లకి కాదోరు
అది మోసిన బోయీలెవ్వరు?...
తక్షశిలా, పాటలీపుత్రం,
హరప్పా, మొహంజొదారో,
క్రో-మాన్యాన్‌ గుహముఖాల్లో
చారిత్రక విభాత సంద్యల
మానవకథ వికాసమెట్టిది?'
ఈ చరణాలను ఇప్పుడు స్మరించుకోవడం సముచితం.

జాతీయ విజ్ఞానశాస్త్ర దినోత్సవం

విజ్ఞాన వీచిక డెస్క్   Wed, 24 Feb 2010, IST  
ప్రతి సంవత్సరం ఈ నెల 28న 'జాతీయ సైన్స్‌ దినోత్సవం' జరుగుతుంది. నోబెల్‌ బహుమతి గ్రహీత సర్‌ సి.వి.రామన్‌ కనిపెట్టిన రామన్‌ ఎఫెక్ట్‌కు గుర్తింపుగా ఈరోజున జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవాన్ని జరపాలని 1986లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే రోజున రామన్‌ తన విశిష్ట 'రామన్‌ ఎఫెక్ట్‌'ను కనుగొన్నారు. ''కొత్త విషయాలను కనిపెట్టి దేశాభివృద్ధికి తోడ్పడిన శాస్త్రజ్ఞులకు ఈరోజున దేశం కృతజ్ఞతలతో, గౌరవాభివందనలను తెలుపుతుంది. ఈ రోజున జరిగే విద్యాకార్యక్రమాలు బాలల్ని 'విజ్ఞానశాస్త్రం' వైపు ఆకర్షించి, వృత్తిగా స్వీకరించేందుకు ప్రోత్సహిస్తుంది. శాస్త్రజ్ఞులందరూ నాణ్యమైన పరిశోధనలతో దేశాభివృద్ధికి పునరంకితం కావడానికి, వీరి పరిశోధనలతో దేశం గర్వపడడానికి ఈ రోజు అవకాశం కల్పిస్తుంది. ''దేశప్రగతికి, జాతి పురోభివృద్ధికి శాస్త్రవిజ్ఞానం అత్యవసరమని ఈ రోజు ఉత్సవాలు దేశప్రజలకు సందేశాన్నిస్తాయి'' అని రాష్ట్రపతి ప్రతిభాపాటిల్‌ సూచించారు.

విజ్ఞానశాస్త్ర ఫలాలు ముఖ్యంగా నూతన సాంకేతికాల రూపంలో అందుబాటులోకి వస్తున్న సాంకేతిక ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలవారికీ, ముఖ్యంగా అణగారిన వర్గాలకూ, పేదలకూ అందాలని మన విజ్ఞాన వీచిక కోరుకుంటుంది. అలానే జనవిజ్ఞాన వేదిక లాంటి ఇతర సంస్థలూ కోరుకుంటున్నాయి. అయితే ఇప్పటి ప్రపంచీకరణలో అదనపు సౌకర్యాల పేరుతో ఆధునిక సాంకేతికాల ద్వారా బహుళజాతి కంపెనీలు మన దేశ వనరులను ప్రజలను, శ్రామికులను దోచుకుంటూ మన ఆర్థిక, సాంఘిక వ్యవస్థలపై పట్టును సాధించుకుంటున్నాయి. ఒకవైపు ఈ సాంకేతికాలు అదనపు ప్రయోజనాలను కలిగిస్తున్నట్లు కనిపిస్తున్పప్పటికీ, అవి కలిగించబోయే నష్టాలను వెంటనే అంచనాకు రాలేకపోతున్నాం. ఉదాహరణకు.. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో, పట్టణ మురికివాడల్లో నాణ్యమైన తాగునీటి లభ్యత ఒక సమస్యగా ఉంది. దీనివల్ల అనేకమందికి జబ్బులు వస్తున్నాయి.

ఎంతోమంది అంటురోగాల బారిన కూడా పడుతున్నారు. వెంటనే వైద్యం అందనివారు చనిపోతున్నారు కూడా. వీరికి నాణ్యమైన, సురక్షితమైన నీటి సరఫరా చేస్తే సమస్య పరిష్కారమవుతుంది. దీనికోసం క్లోరినేషన్‌ చేసి వడపోసి సురక్షితమైన నీటిని సరఫరా చేస్తే సరిపోతుంది. ఇది చౌకైనది కూడా. ప్రత్యామ్నాయంగా కాచి, చల్లార్చి, వడబోసిన నీటిని అలవాటు చేయిస్తే కూడా సమస్య పరిష్కారమవుతుంది. ఇది అన్నికాలాల్లో సురక్షితమైన, విశ్వసనీయమైన పద్ధతి కూడా. దీనికి బదులుగా ప్రభుత్వం ఏం చెపుతుందంటే.. ఈ ప్రాంతాల్లో ప్రజల ఆరోగ్యాల్ని కాపాడడానికి 20లీటర్ల మినరల్‌వాటర్‌ను రెండు రూపాయలకే సరఫరా చేస్తానని చెప్తుంది. ఒక పథకాన్ని కూడా రూపొందించింది. దీని అసలు ఉద్దేశం సురక్షితమైన నీటిని సరఫరా చేసే ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడం కాకుండా ప్రకృతి వనరైన నీటిని అమ్మి కొనే వస్తువుగా మార్చడం. తద్వారా కార్పొరేట్‌ రంగాలకు ప్రకృతివనరులను కట్టబెట్టి, వారికి శాశ్వత లాభాలను సమకూర్చిపెట్టడం. ఇటువంటి కార్పొరేట్‌ అనుకూల నిర్ణయాలను, దీనిలో ఉన్నటువంటి సాంకేతికాలను ప్రజలకు వివరిస్తూ సైన్స్‌ దినోత్సవ సందర్భంలో ప్రజలను చైతన్యపర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీన్ని గమనంలో ఉంచుకొని విజ్ఞానవీచిక వరుసగా గత రెండు వారాలు (11,18 తేదీల్లో)గా సాంకేతిక విజ్ఞానం మంచిచెడ్డలను పాఠకుల దృష్టికి తీసుకువచ్చింది. ఈ సందర్భంలో మినరల్‌ వాటర్‌ గురించీ ఈ శీర్షిక కిందే రెండుసార్లు (మే, 14, జులై 31) వివరాలు ఇచ్చాం. ఈ విజ్ఞానం జాతీయ సైన్స్‌ దినోత్సవం సందర్భంగా అందరిలోకి వెళ్లాలని విజ్ఞానవీచిక కోరుకుంటుంది.

గత ఐదేళ్లులో చేసిన కృషి ఆధారంగా విజ్ఞానశాస్త్రాన్ని సమర్థవంతంగా ప్రచారం చేసిన వ్యక్తికి లేదా సంస్థకు, ప్రచార మాద్యమానికి (పేపరు, రేడియో, టీవీ, చిత్రాలు), బాలల్లో శాస్త్రీయ దృక్పథాన్ని ప్రచారం చేసిన వారికి వేరువేరుగా ఈ సందర్భంలో జాతీయ పురస్కారాలు ఇస్తారు. శాస్త్ర, సాంకేతిక విజ్ఞానం వైపు బాలల్ని ఆకర్షించేందుకు ఈ రోజున వివిధ పరిశోధనా సంస్థలు బాలల్ని ఆహ్వానించి తమ పరిశోధనల్ని చూపెడతాయి. సైన్స్‌ ప్రదర్శనలు, పోటీలు, ఇతర కార్యక్రమాలు బాలల్లో శాస్త్ర విజ్ఞానం, శాస్త్రీయ దృక్పథంపై అవగాహనను పెంచుతుంది. దీనికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. శాస్త్రీయ దృక్పథం విస్తరిస్తున్నమేర ఈ ఉత్సవాల లక్ష్యాలు నెరవేరినట్లుగా భావించాలి.
ముగింపు
విజ్ఞానశాస్త్రం విస్తరిస్తున్నకొలదీ, అదనపు సాంకేతికాలు అందుబాటులోకి వస్తాయి. వీటిని ఉపయోగించుకున్న మేర అదనపు సౌకర్యాలను, అవకాశాలను కలిగించవచ్చు. కానీ, ఏ కొత్త సాంకేతికాన్నైనా వినియోగించుకునే ముందు దాని మంచి, చెడ్డలను గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. కేవలం ప్రచార సమాచారం మీద ఆధారపడకుండా, స్నేహితులు, శ్రేయోభిలాషులు, జనవిజ్ఞాన వేదిక లాంటి స్వచ్ఛంద సంస్థల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకొని కొత్త సాంకేతికాలను ఆహ్వానించి, నిత్యజీవితంలో ఇముడ్చుకోవాలి. దీనికి బదులుగా కేవలం కంపెనీల ప్రచారం మీద ఆధారపడి, నిర్ణయం తీసుకుంటే, పలు సందర్భాలలో విలువైన వనరులను, కాలాన్ని నష్టపోవాల్సి రావచ్చు. లేదా కంపెనీల మీద, ఇతర సంస్థల మీద ఆధారపడాల్సి రావచ్చు. తద్వారా అదనపు ఖర్చుల, స్వేచ్ఛా స్వాతంత్య్రాల్ని కోల్పోవాల్సి రావచ్చు. ముఖ్యంగా, కొత్తకొత్తగా మార్కెట్‌లోకి వచ్చే ఆహారపదార్థాలు, ఇతర విషయాల్లో పలు జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రపంచీకరణ కాలంలో నష్టపోయే పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. అందువల్ల నిత్య జీవితంలో కొత్తగా ఇముడ్చుకునే సాంకేతికాలు అంతిమంగా భారం కాకూడదని అనుకుంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

వాస్తుపై వాదోపవాదాలు

విజ్ఞాన వీచిక డెస్క్   Wed, 24 Feb 2010, IST  
  • విశ్వాసాలు.. వాస్తవాలు... 17
వాస్తువాది గౌరు తిరుపతిరెడ్డి తన 'గౌరువాస్తు' అనే మాసపత్రిక ఆగస్టు 2005 సంచికలో ఇలా సవాల్‌ విసిరారు.
''మేము వాస్తుకు విరుద్ధంగా ఒక ప్లాన్‌ ఇస్తాం. ఈ ప్లాన్‌ ప్రకారం హైదరాబాద్‌ నుండి ప్రొద్దుటూరుకు వెళ్ళే మెయిన్‌రోడ్డుకు ఇరువైపులా 20కి.మీ. దూరంలోపు గ్రామాలలో మాత్రమే ఇంటిని నిర్మించాలి. ఇలాంటి ఇంట్లో ఐదేళ్లు కాపురం ఉండాలి. ఈ ఐదేళ్లలో ఆ కుటుంబం ఎలాంటి ఒడిదుడుకులకు లోనుకాకుండా జీవించగల్గితే గౌరువాస్తు ప్రకటిస్తున్న రెండు లక్షల రూపాయలు ఆ ఇంట్లో నివసించిన కుటుంబం తీసుకోవచ్చు. అలా జీవించలేకపోతే వారు డిపాజిట్‌ చేసిన రెండు లక్షల రూపాయలు కోల్పోవలసి వస్తుంది. ''ఆ ప్లానులో ఆయన సూచించిన వాస్తుదోషాలేమిటంటే (1) పశ్చిమ నైరుతిలో గేటు (2) నైరుతిలో నుయ్యి (3) దక్షిణ-పశ్చిమాలలో భూమిలో నీరు నిలువ ఉంచడం. ఈ మూడు దోషాలు మరణాన్ని కలిగిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇలాగే మరికొన్ని వాస్తుదోషాలుగా పేర్కొనబడిన ఇంటిని సూచించారు. వాటి కారణంగా పురుషుల జీవితాలకు ఘోరకలి అనీ, సుదతుల సుఖాలను నలగదంచుతుందనీ, అంతులేని అరిష్టాలొస్తాయనీ అస్పష్ట ఫలితాలు సూచించారు. దానికి నేనిచ్చిన సమాధానాన్ని, దానికి గౌరుగారి సమాధానాన్ని 'గౌరువాస్తు' అక్టోబరు 5లో ప్రచురించారు. నేను నా సమాధానంలో ఇలా పేర్కొన్నాను.

''మీ సవాల్‌లో మీరు సూచించిన వాస్తుదోషం ఉన్న ఇంట్లో ఐదు సంవత్సరాలు 'ఎలాంటి ఒడిదుడుకులకు లోనుకాకుండా జీవించగలిగితే'' రెండులక్షల రూపాయలు ఇస్తామన్నారు. వాస్తును సైన్సుగా మీరు పరిగణిస్తున్నారు. కాబట్టి, మీ సవాలు మరింత శాస్త్రబద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఏ వాస్తు దోషం కారణంగా ఏకాలంలో ఎటువంటి దుష్ఫలితం వస్తుంది అనే విషయాన్ని మీరు స్పష్టంగా పేర్కొనాలి. అంతేకాని 'ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా' అని అస్పష్టంగా ప్రకటిస్తే ఎలా? ఐదు సంవత్సరాలపాటు ఆ ఇంట్లో ఎవ్వరికీ జలుబులు, దగ్గులు, జ్వరాలు రాకుండా ఉంటాయా? దానిని కూడ మీరు మీ ఒడిదుడుకుల జాబితాలో చేర్చవచ్చుగదా? అందువలన, వాస్తు దుష్ఫలితాలను స్పష్టంగా ప్రకటించండి. అంతేకాదు. 'వాస్తుదోషం' ఉన్న ఇళ్ళవాళ్లు పట్టణాల నుండి, నగరాల నుండి మీ వద్దకు వందల సంఖ్యలో వస్తుంటారు. అలాంటి వారికి నివారణా పద్ధతులు చెప్పకుండా మా జనవిజ్ఞాన వేదిక సభ్యులకు కనీసపు అద్దెకీయమనండి. పైన నేను పేర్కొన్నట్లు 'ఆ ఇళ్ళలోని వాస్తు దుష్ఫలితాన్ని' మీరు స్పష్టంగా పేర్కొనండి. మీ సవాలును ఎదుర్కొనడానికి మా కార్యకర్తలకు మరింత సౌకర్యంగా ఉంటుంది. అంతేకాని హైదరాబాద్‌-ప్రొద్దుటూరు మెయిన్‌రోడ్డుకు 20 కి.మీ. దూరంగా ఉండే గ్రామంలో ఏ ఉద్యోగస్థుడైనా, వ్యవసాయదారుడైనా ఐదు సంవత్సరాలు ఎలా ఉండగలడు? ఏం పెట్టుకొని తినగలడు? కాబట్టి మీరు మరింత వాస్తవిక దృక్పథంతో విషయాన్ని పరిశీలించి సవాలును విసిరితే, ఆ సవాలును స్వీకరించడానికి జనవిజ్ఞానవేదిక కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను.''
నా సమాధానానికి గౌరు తిరుపతిరెడ్డి ప్రతి సమాధానం ఏమిచ్చారో వచ్చే వారం ఇదే శీర్షికలో చదవండి...
- కె.ఎల్‌.కాంతారావు, (జనవిజ్ఞానవేదిక)

వేప చెట్టు నుండి పాలు..?

విజ్ఞాన వీచిక డెస్క్    Wed, 17 Feb 2010, IST  
  • విశ్వాసాలు.. వాస్తవాలు... 16
'రఘుచంద్‌ గారూ! ఈ విషయం విన్నారా?' అంటూ లోపలికొచ్చాడు స్థానిక జనవిజ్ఞాన వేదిక కార్యకర్త శ్రీను.
రఘుచంద్‌ ప్రకాశంజిల్లా అద్దంకి జనవిజ్ఞాన వేదిక బాధ్యుడు.
'ఏ విషయమండీ?' అడిగారు రఘుచంద్‌.
'మన ఊళ్ళో ఉదయం నుండి ఒక వేప చెట్టుకు తెల్లని పాల వంటి ద్రవం కారుతున్నదండీ. వేప చెట్టుకు పాలు కారుతున్నాయనీ, అదేదో మహిమ అనీ చాలామంది అనుకుంటున్నారు. కొంతమంది ఆ చెట్టుకు పూజలు, ప్రదక్షిణలూ మొదలెట్టారు. ఇప్పుడేం చేద్దాం?' అడిగాడు శ్రీను.
'చెట్లకు మహిమలుండటం అసంభవం. దీని వెనుక ఏదో విజ్ఞానశాస్త్ర విశేషం దాగి ఉంటుంది. ఆ విశేషం ఏమిటో వృక్షశాస్త్రజ్ఞులకు తెలుస్తుంది. అందువలన మన జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర బాధ్యులు, వృక్షశాస్త్ర ఆచార్యులు అయిన ప్రొఫెసర్‌ సత్యప్రసాద్‌గారిని అడుగుదాం'' అన్నారు రఘుచంద్‌.
వెంటనే ప్రొ|| సత్యప్రసాద్‌ గారికి ఫోను చేసి అద్దంకిలో పరిస్థితిని వివరించడం జరిగింది. ఆయన చెట్టు నుండి పాల వంటి ద్రవం కారడాన్ని గూర్చి ఇలా వివరించారు.
'పెద్ద పెద్ద వృక్షాలకు రకరకాల కారణాలతో ఇన్‌ఫెక్షన్‌ సోకుతుంది. అది బాక్టీరియా వలన కావచ్చు. శిలీంధ్రం వలన కావచ్చు. అలాంటప్పుడు చెట్టు మానులో ఎక్కడైనా గాయమైనప్పుడు, ఆ భాగంలో ఉండే లేటెక్స్‌ వంటి చిక్కని ద్రవపదార్థం బయటకు వస్తుంది. దానినే చెట్టు నుండి పాలు కారడంగా సైన్సు తెలియని వారు అనుకుంటుంటారు. 1, 2 రోజుల్లో అదే తగ్గిపోతుంది. దీనిలో ఎలాంటి మహిమా లేదు.'' ఈ విషయాన్ని రఘుచంద్‌గారు స్థానిక పత్రికా విలేకరులను పిలిచి వివరించారు. మరునాడు అన్ని పత్రికలలోనూ ఆయన ఇచ్చిన శాస్త్రీయ వివరణ ప్రచురితమైంది. ప్రజలలో ఆలోచన మొదలైంది. ద్రవం కారడం కొద్దిరోజుల్లో ఆగిపోయింది. క్రమంగా వేపచెట్టుకు పూజలు చేసే భక్తుల సంఖ్య తగ్గిపోయింది.
- కె.ఎల్‌.కాంతారావు, (జనవిజ్ఞానవేదిక)(మరొకటి వచ్చేవారం)

'కల్కి' విష్ణమూర్తి అవతారమా?

విజ్ఞాన వీచిక డెస్క్   Wed, 10 Mar 2010, IST  
  • విశ్వాసాలు.. వాస్తవాలు...
'మాష్టారూ! కల్కి భగవాన్‌ దేవుడేనా?' పటేల్‌ హైస్కూల్‌లో 'దేశభక్తి- శాస్త్రీయ అవగాహన'పై క్లాసు తీసుకోవడానికి వెళ్లినపుడు శశికాంత్‌ అనే విద్యార్థి అడిగిన ప్రశ్న ఇది. 'శశికాంత్‌! నీవు అడిగింది 'కల్కి భగవాన్‌'ని అని ప్రకటించుకున్న విజయకుమార్‌ అనే వ్యక్తి గురించేనా?' అని నేను అడిగాను. 'అవును మాష్టారూ! ఆయనకు లక్షలమంది భక్తులున్నారు. ఆయన కాళ్ళు కడగాలంటే లక్ష రూపాయలు ఆయనకివ్వాలట.' అన్నాడు శశికాంత్‌. ''ఇంతకీ ఆయన తనను గూర్చి ఏమని ప్రకటించుకున్నాడో తెలుసా?' 'తెలుసు మాష్టారూ! తాను విష్ణుమూర్తి పదవ అవతారమైన 'కల్కి'నని ఆయన ప్రకటించుకున్నాడు' అని క్లాసులోనే ఉన్న నిర్మలా టీచర్‌ బదులిచ్చింది. 'ఏ సంవత్సరంలో?' '1989లో మాష్టారూ!' మరో టీచర్‌ సుజాత జవాబిచ్చారు. 'ఇది 2010. అంటే ఆయన తనను తాను విష్ణుమూర్తి పదవ అవతారమని ప్రకటించుకొని ఇప్పటికి 21 ఏళ్ళయింది. ఇన్నేళ్ళలో దేశంలోని ఏ ఒక్క పండితుడుగానీ, పురాణాల పారాయణులుగానీ ఆయనను, ఆయన అవతారాన్ని ప్రశ్నించలేదు. ఇది విచిత్రం కాదా? దేశ దౌర్భాగ్యం కాదా?' అని ప్రశ్నించాను. 'దేశ దౌర్భాగ్యం ఎందుకని మాష్టారూ?' అడిగాడు జోగీందర్‌సింగ్‌.
'అది చెప్పబోయే ముందు మీకో విషయం చెబుతాను. ఈ సంవత్సరం డిసెంబరులో భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ హైదరాబాదు వచ్చి ఒక పెద్ద సైన్సు మహాసభలో పాల్గొంటాడని అన్ని పత్రికల్లో వార్త వచ్చిందనుకోండి.

మీరందరూ ఆ వార్త చదివారనుకోండి. అయినా, ఈ నెలలో అంటే మార్చినెలలోనే ఒకరోజు నేను మీ ఏరియాలోని ఒక ఇంట్లో కూర్చొని మైకులో ''నేను 'భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను రండి! నాకు నమస్కారాలు చేయండి! నేనిచ్చే మంత్రజలం తీసుకోండి!' అని మైకులో చెబుతున్నాననుకోండి. అప్పుడు మీరందరూ నా దగ్గరకు వచ్చి నమస్కారాలు చేస్తారా? మంత్రజలం కోసం క్యూలు కడతారా?'
'చెయ్యం మాష్టారూ!' జవాబిచ్చాడు జహంగీర్‌. 'ఎందుకు చెయ్యరు?' 'ఎందుకంటే - మొదటి కారణం భారత ప్రధాని డిసెంబరులో వస్తానన్నారు కాబట్టి మార్చిలోనే వచ్చిన వ్యక్తిని ప్రధాని అని మేమెట్లా నమ్ముతాం. రెండవది, భారత ప్రధాని విమానంలో వస్తాడుగానీ మీలాగా స్కూటీ మీద రాడు కాబట్టి. మూడవ విషయం ఆయన సైన్సు మహాసభకు వస్తారనే వార్త వచ్చిందిగానీ మంత్రజలం ఇవ్వడానికని వార్తల్లో లేదుగా? మంత్రజలం ఇవ్వడమనేది సైన్సుకు విరుద్ధం కదా? అందుకని, మీరు వార్తల్లో ప్రకటించిన టైముకంటే ముందు వచ్చి భారత ప్రధానినని ప్రకటించుకున్నా మేం నమ్మం' దృఢంగా బదులిచ్చాడు జహంగీర్‌. 'దురదృష్టకరమైన విషయమేమంటే మనదేశంలో లక్షలాదిమంది విద్యాధికులకు యీమాత్రం శాస్త్రీయ విశ్లేషణా జ్ఞానం కొరవడింది. వారి ఆలోచనలు మొద్దుబారాయి. ఎలాగంటే మన పురాణాలు భాగవ తం, భవిష్య పురాణాల ప్రకారం విష్ణుమూర్తి పదవ అవతారమైన కల్కి కలియుగాంతంలో జన్మించి, గుర్రం మీద ఎక్కి వస్తాడనీ, కత్తితో పాపులను సంహరిస్తాడనీ చెప్పబడింది.
అందుకే పూజల సందర్భంగా బ్రాహ్మణులు 'కలియుగే, ప్రథమపాదే' అని చదువుతారు. అంటే కలియుగాన్ని నాల్గుభాగాలుగా విభజిస్తే, అందులో మొదటిభాగంలోనే మనం ఉన్నామని అర్థం. శాస్త్రీయంగా ఆలోచించేవారు, ఇప్పటికి నాలుగు లక్షల సంవత్సరాల తర్వాత, అంటే రాకెట్లూ, ఎకె47 వంటివి అభివృద్ధి చెంది, ఇంకా అభివృద్ధి చెందుతున్న పరిస్థితుల్లో గుర్రంమీద వచ్చిన వ్యక్తి, కత్తులతో శత్రువులను చంపగలడంటే అంగీకరించరనుకోండి. అయినా, పురాణాలను నమ్మేవారు కల్కి భగవానుడవతరిస్తాడని నమ్ముతున్నారు. ఎప్పుడు? ఇంకా నాలుగు లక్షల సంవత్సరాల తర్వాత. దేనిమీద? గుర్రం మీద. పాపులను దేంతో సంహరిస్తాడు? కత్తితో. మరి కలియుగం మొదట్లోనే ఒక వ్యక్తి వచ్చి నేనే విష్ణుమూర్తి పడవ అవతారాన్ని, కల్కిని. అని ప్రకటించుకోగానే ఈ పురాణాలు నమ్మేవారు ఆయన్ని కల్కిగా ఎలా అంగీకరిస్తున్నారు? ఈయన అసలు పేరు విజయకుమార్‌. ఆయన్ని తెలిసిన వారు చెప్పిన దాన్నిబట్టి స్కూల్లో చదువులో సగటు విద్యార్థిగా ఉండేవాడు. ఎల్‌ఐసిలో క్లర్క్‌గా పనిచేశాడని, డబ్బు సరిపోక ప్రభుత్వేతర సంస్థను ఒకదాన్ని స్థాపించాడట. అందులో కూడా డబ్బు సంపాదించలేక భగవంతుని పేరు మీద కల్కి అనే అవతారం ఎత్తాడు. భక్తులకిచ్చే ప్రసాదంలో మత్తు పదార్థాలు ఇచ్చాడు. దీనివల్ల వారు తమ కష్టాలను తాత్కాలికంగా మర్చిపోయేవారు. తన భార్యను 'అమ్మా భగవతి' అని పూజించాలని ఆదేశించాడు. పూజలకు వేలు, లక్షల రూపాయలను నిర్ణయించేవాడు.

వేల ఎకరాలను ఆర్జించాడు. నిజంగా అతను ఆధ్యాత్మిక స్వరూపమైతే ఈ ఆస్తులు ఏం చేసుకుంటాడు? ఇది ప్రజల్ని మోసగించడం కాక మరేంటి? దేవుడి పేరుమీద ఎవరినైనా, ఎలాంటివారినైనా మోసం చేయొచ్చనే దాన్ని ఎవరూ ఖండించడం లేదు. ఆయనకు గుర్రం స్వారీ కాదుగదా, గుర్రం జీను పట్టుకోవడమే రాదు. ఆయన ఆశ్రమంలోనూ, ఆశ్రమ ప్రాంతంలోనూ అనేకమంది చంపబడుతున్నారుగాని వాళ్లు పాపులుగాదు; ఆయన భక్తులు. అలా తమ నమ్మకాలకు విరుద్ధమైన వ్యక్తిని కల్కి అవతారంగా లక్షలాది మంది విద్యాధికులు ఎలా భావిస్తున్నారో అర్థంకాకుండా ఉంది. వారిలో ఇలాంటి అశాస్త్రీయ నమ్మకాలు పోవాలంటే ఏం కావాలో చెప్పండి' క్లాసును ఉద్దేశించి ప్రశ్నించాను.
'వారిలో శాస్త్రీయ దృక్పథం పెరగాలి మాష్టారూ!' సాయిలక్ష్మి బదులిచ్చింది. ఆ జవాబుకు అంగీకార సూచకంగా విద్యార్థినీ విద్యార్థులు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు కరతాళధ్వనులు చేశారు.
(వచ్చేవారం మరొకటి)
కె.ఎల్‌.కాంతారావు
జన విజ్ఞాన వేదిక.

బాబాలు.. నిజానిజాలు

బాబాలు.. నిజానిజాలు

బాబాల వల్ల సామాన్యులు ఏదో పేరుతో మోసగించబడుతున్నారనే వార్తలు నిత్యం వస్తున్నాయి. ఒకవైపు చంద్రునిపై నివాసాల్ని ఏర్పర్చుకుని, పరిశోధనలను నిర్వహించేదిశలో విజ్ఞానశాస్త్రం దినదినాభివృద్ధి చెందుతోంది. మరోవైపు ఈ బాబాల మోసాలు సమాజంలో పెచ్చుమీరిపోయి ప్రజలు మోసపోతున్న వార్తలు ఆశ్చర్యాన్ని, ఆందోళనను కల్గిస్తున్నాయి. ఏ పేరుతో వ్యవహరించినప్పటికీ, బాబాలలో కొన్ని సాధారణ లక్షణాలు ఒకేలా ఉన్నాయి. వీరందరికీ మానవాతీతశక్తులు, మహిమలున్నట్లు, వీరు మంత్రాలు, తంత్రాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిని ఆశ్రయించి, కటాక్షం పొందితే సామాన్యుల కష్టాలు తొలగిపోతాయనే ప్రచారం కూడా జరుగుతోంది. తదనుగుణంగా ఏదో సందర్భంలో వీరు తమకున్నాయని చెప్పుకొనే 'మానవాతీత శక్తులను, మంత్ర-తంత్రాలను' ఏదో రూపంలో ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఏదో ఒక మతవిశ్వాసాల ఆధారంగానే వీరు ఈ పనిచేస్తున్నారు. వీరికీ మతానికీ, మతవిశ్వాసాలకూ ఉన్న సంబంధమేమిటి? వీరు ఇంతమందిని ఎలా భ్రమింప చేయగలుగుతున్నారు? తద్వారా వేల కోట్ల స్థాయిలో ఎలా వ్యాపారం చేయగలుగుతున్నారు? అని ఈనాటి 'విజ్ఞానవీచిక' 'జనవిజ్ఞాన వేదిక' సహకారంతో పరిశీలిస్తుంది.
అసలు మన రాజ్యాంగం ఆధునిక భావాలతో రూపొందింది. మన దేశం సార్వభౌమాధికారాలు గల సోషలిస్టు (సమసమాజం), లౌకిక, ప్రజాస్వామ్య విలువలు గల రిపబ్లిక్‌గా ఉపోద్ఘాతంలోనే చెప్పబడింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 51ఏ-క్లాజ్‌ హెచ్‌ ద్వారా శాస్త్రీయ దృక్పథాన్ని, మానవ విలువల్నీ, నూతన విషయాలను కనుక్కొనే స్ఫూర్తి, సంస్కరణనశీలతను అభివృద్ధిపరచడం ప్రతి పౌరుని ప్రాథమిక బాధ్యతగా నిర్దేశించబడింది. అయితే, ఎవరైనా, ఏ మత విశ్వాసాన్నైనా కలిగి ఉండటానికి, తదనుగుణంగా ప్రచారం చేసుకోవడానికి మన రాజ్యాంగం అవకాశం కలిగించింది. రాజ్యాంగానికి బద్ధులై, అది నిర్దేశించిన విలువలను పెంపొందించే రూపంలో పాలకులు అన్ని నిర్ణయాలూ తీసుకోబడాలి. ఈ నిర్ణయాల్లో నిర్ణయాలు తీసుకునేవారి వ్యక్తిగత అభిప్రాయాలను, విలువలను ప్రతిబింబించడానికిి రాజ్యాంగంలో ఏ ప్రత్యేక అవకాశం లేదు. కానీ, దురదృష్టంగా తమ అధికార బాధ్యతలను అటుంచి, కనీస పౌరుల బాధ్యతలను మరిచి, శాస్త్రీయ దృక్పథాన్ని అభివృద్ధిపర్చాల్సిన ప్రథమపౌరుడు (దేశాధ్యక్షుడు), ప్రధాని, రాష్ట్ర ముఖ్యమం త్రులు, జాతీయ, రాష్ట్రస్థాయి మంత్రులు బాబాలనెందరినో దర్శిస్తూ, సాష్టాంగ పడుతూ, పూజిస్తూ తమ స్థాయిని దిగజార్చు కొంటున్నారు. అంతేగాకుండా, బాబాలకు లేని గౌరవాన్ని కలిగిస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకొని, బాబాలు అధికార మద్దతుతో సామాన్యులను ఇంకా పెద్దఎత్తున మోసం చేస్తున్నారు. వాళ్లు చేసే దుశ్చర్యలను రాజ్యం (ప్రభుత్వం) నియంత్రించడంలో విఫలమవు తుంది. ఫలితంగా, వీరి కార్యక్రమాలు పుట్టగొడుగుల్లా విస్తరిస్తున్నాయి. ఇవి ఎంతగా విస్తరిస్తున్నాయంటే మతాన్ని, మతవిశ్వాసాలను వినియోగించుకొని, ఎలాంటి చట్ట వ్యతిరేక, మోసాలనైనా ఏ శిక్షకు గురికాకుండా చేయవచ్చనే అభిప్రాయం బలంగా, వేగంగా వ్యాపిస్తుంది. వీరెవ్వరూ ప్రభుత్వ చట్టాలకు లోబడి పనిచేయాలని ఆచరణలో భావించడం లేదు.
మతమూ..వీరు..
ఆధ్యాత్మికం ఆత్మకు సంబంధించింది. ఆత్మ జీవునికీ లేదా భగవంతునికీ సంబంధించింది. బాబాలకు సంబంధించినంత వరకూ తమ ఆత్మతో సంబంధం కలిగి ఉంటారుగానీ, ఇతరుల ఆత్మలతో సంబంధం ఉండదు. బాబాలు దైవత్వాన్ని తమకు ఆపాదించుకుంటున్నారే కానీ, వారు ఆచరించే విలువలకూ, దైవ విలువలకూ ఎలాంటి సంబంధం లేదు. తాత్వికంగా చూస్తే, 'భగవంతుని భావన' ఒక అపారమైన ఉన్నతశక్తి స్వరూపంగా అభివర్ణిస్తారు. నిర్వికారుడు. ఈ భావనల ఆధారంగానే విశ్వాసాలు, మతం, మతవిశ్వాసాలు రూపొందాయి.
ఏ అభిప్రాయాన్నైనా ప్రశ్నించకుండా కేవలం నమ్మకం ఆధారంగా అంగీకరించడాన్నే మూఢ విశ్వాసంగా భావిస్తున్నాం. మతవిశ్వాసాలు గలవారు తమ విశ్వాసాలను ప్రశ్నించ డాన్ని అంగీకరించరు. గరిష్టంగా, అనుమాన నివృత్తికోసం వివరణలను కోరవచ్చు. ప్రశ్నించినవారిని వీరు వ్యతిరేకిస్తారు. తాత్వికంగా పరిశీలిస్తే, విజ్ఞానశాస్త్ర విశ్వాసాలు, మత విశ్వాసాలు రెండూ ప్రకృతి, పరిసరాలను అర్థంచేసుకునే ప్రక్రియలో ఉద్భవించాయని చెప్పవచ్చు. మన చుట్టూ పరిసరాల్లో ఉండే జీవంలేని పదార్థాలు దేనితో తయారయ్యాయి? వేడి, వెలుతురు, ధ్వని, ఉరుము, మెరుపులలో ఇమిడి ఉన్న భౌతిక ప్రక్రియలు ఏమిటి? భూ ఉపరితలానికి సంబంధం లేకుండా ప్రతిరోజూ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఎలా కదులుతున్నాయి? ఎందుకు కదులుతున్నాయి? పగలు-రాత్రి మొదలైనవి ఎందుకు, ఎలా క్రమం తప్పకుండా వస్తున్నాయి? బహుశా ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కనుగొనే ప్రక్రియలోనే మత, విజ్ఞానశాస్త్ర విశ్వాసాలు ఏర్పడ్డాయి.

మూఢవిశ్వాసాలు మతం ద్వారా ఏర్పడతాయి. సైన్స్‌ ద్వారా కూడా విశ్వాసాలు ఏర్పడతాయి. కానీ, ఈ రెంటికీ ఎంతో తేడా ఉంది. సైన్స్‌ ఆధారిత విశ్వాసాలు (నమ్మకాలు) ప్రయోగం, అనుభవం ఆధారంగా ఏర్పడ్డవి. వీటిని ఎప్పుడైనా, ఎవరైనా తిరిగి ప్రయోగం ద్వారా నిర్ధారించుకోవచ్చు. కానీ, మత విశ్వాసాలకు ఈ అవకాశం లేదు. మత విశ్వాసాల ద్వారా అందే సమాధానం / సమాచారం అతేంద్రియశక్తుల నుండి మానవుల స్వీకరించి, వారు తిరిగి ఇతరులకు అందిస్తున్నామని చెబుతారు. అందువల్ల వీరందించే సమాధానం ఇచ్చేవారి మీద ఆధారపడి ఉంటుంది. మత విశ్వాసంలో ఉన్న ఈ ప్రక్రియను బాబాలు తమ స్వార్థ ప్రయోజనాలకు వినియోగించుకొంటున్నారు. కొంతమంది (కల్కి విజయకుమార్‌ లాంటివారు) ఒకడుగు ముందుకు వెళ్లి తామే భగవత్‌ స్వరూపులమని చెప్పుకుంటూ ప్రజల్ని మోసగిస్తున్నారు.
ఏ మతం కూడా అవాస్తవాలతో ఇతరులను మోసం చేయాలని చెప్పడం లేదు. వాస్తవాలనే చెప్పాలని నిర్దేశిస్తున్నాయి. దాదాపు అన్ని మతాలూ నిరాడంబర జీవితాన్నే ప్రోత్సహిస్తున్నాయి. ఇతర జీవుల పట్ల, ముఖ్యంగా తోటి మానువులతో, కరుణతో వ్యవహరించాలని నిర్దేశిస్తున్నాయి. కష్టాలు ఉన్నవారికి సహాయపడాలని బోధిస్తున్నాయి. మానవసేవే, మాధవసేవ అని నానుడి. కానీ, నిత్యజీవితంలో బాబాలు పాటించే విలువలు వీటన్నింటికీ విరుద్ధం. వీరు స్వయంగా మతవిశ్వాసాలను పాటించడం లేదు. వీరి కార్యక్రమాలన్నీ మత ప్రభోదాలకు విరుద్ధంగా కొనసాగుతున్నాయి. కానీ, వీరు ప్రజల్లో ఉన్న మతవిశ్వాసాలను, భ్రమలను తమ స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు.

కేవలం హస్తలాఘవం (దృష్టిమరల్చి చేతివాటంగా చేసే మ్యాజిక్స్‌), కొన్ని పదార్థాల మధ్య జరిగే రసాయనిక చర్యలు, సహాయకులు అందించే మద్దతు ద్వారా తమకు ఏవో అద్భుత, మానవాతీత శక్తులున్నట్లు, తాము దైవాంశ సంభూతులమన్నట్లు ప్రజల్ని భ్రమింపజేస్తున్నారు. మతవిశ్వాసాల ఆధారంగా (అత్యధిక ప్రజలు ఏదో ఒక మతాన్ని నమ్ముతున్నవారే). అమాయక ప్రజల్ని, భయం, నిస్సహాయత, పేరాశకు లోనైనవారిని ఈ బాబాలు తేలికగా మోసం చేస్తున్నారు. వీరు ఏదో రూపంలో నష్టపోతున్నారు. స్వార్థపర, అవినీతి, వ్యాపార, వాణిజ్య, రాజకీయ శక్తులు కూడా వీరితో కుమ్మక్కైవుతూ తమ తమ ప్రయోజనాలను పెంపొందించు కుంటున్నారు. తమ సమస్యలకు బాబాలు పరిష్కారం చూపగలరని సామాన్యులు నమ్ముతూ తమ సర్వస్వాన్నీ అర్పిస్తున్నారు. వారు ఏం చెపితే అది చేస్తున్నారు. పిల్లల పెళ్లిళ్లు, ఉద్యోగం, పదోన్నతి, అనారోగ్య సమస్య ఏదైనా తాము నమ్మే బాబాలు, స్వామీజీలు లేదా అమ్మల చేతుల్లో ఉందనీ, వారు కరుణిస్తే తమ సమస్య నివృత్తి అవుతుందని భ్రమిస్తున్నారు. కొలుస్తున్నారు. అప్పులు చేసైనా భారీగా కానుకలూ సమర్పించుకుంటున్నారు. బాబాలు విలాసవంతమైన జీవనానికి అలవాటుపడ్డారు. విజ్ఞానశాస్త్రం అందించే సర్వసుఖాలనూ, సంసారులు పొందే అన్ని సుఖాలను వీరు అనుభవిస్తున్నారు. వీరందరూ ఏదో పేరుతో పెద్దఎత్తున ఆస్తులు కూడబెట్టుకున్నారు. వీరందరూ ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యాపార, వాణిజ్య ప్రయోజనాల కార్యక్రమాలతో సంబంధం కలిగి ఉన్నవారే! పరిపాలనలో కూడా జోక్యం కలిగి ఉన్నారు. వీరందరూ ఐహిక లోకంలో సుఖాలను పొందుతూ ప్రజలకు మాత్రం పరలోకం, ఆధ్యాత్మిక చింతన గురించి బోధనలు చేస్తున్నారు.
ఇది మనకూ అవసరమే..
మంత్ర, తంత్రాలను, దుష్ట కార్యక్రమాలను, ఇతర అకృత్యాలను నిరోధించి, సామాన్యులను రక్షించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక చట్టాన్ని 2005లో రూపొందించింది. మహారాష్ట్ర మంత్ర,తంత్ర, దుష్ట, నిరసించదగ్గ కార్యాల నిర్మూలన చట్టం (మహారాష్ట్ర, ఎరాడికేషన్‌ ఆఫ్‌ బ్లాక్‌ మాజిక్‌ అండ్‌ ఈవిల్‌ అండ్‌ అభోరీ ప్రాక్టీసెస్‌ - 2005 యాక్ట్‌) పేరుతో రూపొందింది.
దెయ్యాల్ని లేదా ఇతర దుష్టశక్తులను పారద్రోలే పేరుతో ఎవరినైనా తాడు లేదా గొలుసుతో కట్టివేయడం, కర్రతో లేదా ఇతరత్రా కొట్టడం, చెప్పులు నానిన నీటిని తాగించడం, ముంత పొగ పెట్టడం, వేలాడదీయడం, వెంట్రుకలను గుంజడం, కాల్చడం, మలమూత్రాలను తాగించడంలాంటి అన్ని అకృత్యాలు ఈ చట్టం కింద నేరాలుగా పరిగణించబడతాయి. అద్భుతాల పేరుతో ఎవర్నైనా మోసం చేయడం, తద్వారా డబ్బు సంపాదించడం నేరాలుగా పరిగణించబడ్డాయి. వీటిని గురించి ప్రచారం చేయడం, ఇతరులకు ఏదో రూపంలో తెలియజేయడం కూడా నేరంగా ఇందులో పేర్కొనబడింది. అతేంద్రియ, అద్భుతశక్తులను సంతృప్తిపరిచే పేరుతో జీవితాలకి ప్రమాదాన్ని కొనితెస్తూ, గాయపరుస్తూ లేదా ఇతరత్రా హింసించడాన్ని నేరంగా ఈ చట్టం పరిగణిస్తుంది. గుప్త నిధులు కనుగొనేపేర, భూగర్భజలాల్ని కనుగొనేపేర లేదా ఇతర ప్రయోజనాలు వనగూరుస్తామని చేసే మంత్రతంత్రాలకు, ఈ సందర్భంగా ఇచ్చే అన్నిరకాల బలుల్ని ఈ చట్టం నేరంగా పరిగణిస్తుంది. ఏదో ఒక శక్తి ఆవహించిందని మోసం చేస్తూ ఇతరులను భయపెట్టడం కూడా ఈ చట్టం నేరంగా పరిగణిస్తుంది. అన్నిరకాల మంత్ర, తంత్రాలను, దయ్యాలను ఉపయోగిస్తూ ఇతరులను భయపెట్టడానికి, దుష్టశక్తుల్ని వదిలిస్తామని భక్తుల్ని హింసించడం నేరంగా ఈ చట్టం పరిగణిస్తుంది. జబ్బుల్ని నయం చేస్తామని చేసే మాయోపాయాలను (ఉదా: కంటిచూపుతో రోగం నయం చేయడం, స్మర్శతో నయం చేయడం, తొక్కితే, తన్నితే నయం చేయడం.. మొదలైనవి) కూడా నేరాలుగా ఈ చట్టం పరిగణి స్తుంది. సంతానాన్ని కలిగిస్తామని అత్యాచారాలకు పాల్పడడం నేరంగా పరిగణిస్తుంది. వికలాంగుల దగ్గర అద్భుతశక్తులున్నా యని వారిని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేయడం, లేదా ఇతర విధంగా భ్రమింపచేయడం ఈ చట్టం నేరంగా పరిగణిస్తుంది. ఈ కార్యక్రమాలకి మద్దతు తెలుపుతూ, ప్రచారం చేసేవారిని కూడా నేరస్తులుగానే ఈ చట్టం పరిగణిస్తుంది. వీరు శిక్షార్హులు.

ఈ చట్టం కింద శిక్షించడానికి ఎవరూ ఫిర్యాదు చేయాల్సిన అవసరంలేదు. నిర్దేశించిన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ స్థాయి పోలీసు అధికారి ఈ చట్టం నిఘా ఆఫీసర్‌గా పనిచేస్తారు. జరుగుతున్న మోసాలను నివారించడానికి ఈ చట్టం నిర్దేశించిన విధంగా ఈయనే అన్ని చర్యలూ తీసుకుంటారు.
ఈ చట్టం కింద నేరం మోపబడిన వారికి బెయిల్‌ ఉండదు. ఈ చట్టం కింద నేరం చేసిన వారికి కనీసం ఆరునెలల నుండి ఏడు సంవత్సరాల వరకు జైలుశిక్ష ఉంటుంది. దీంతోపాటు రూ.ఐదు వేల నుండి 50 వేల వరకూ జరిమానా కూడా విధిస్తారు.
ఇటువంటి చట్టాన్ని మన రాష్ట్రంలో కూడా చేస్తే దొంగబాబాలను, బాణామతి, చేతబడి, మంత్ర, తంత్రాలు (తాంత్రికులు) ద్వారా మోసగించే వారి నుండి ప్రజలకు రక్షణ కలిపించవచ్చు. దొంగబాబాలు, చేతబడి చేసేవారిని, వీరిని అడ్డంపెట్టుకుని మోసం చేసేవారి కార్యక్రమాల్ని అరికట్టవచ్చు. మత విశ్వాసాల దుర్వినియోగాన్ని నివారించవచ్చు.

పరిష్కారం...

ప్రస్తుత సమాజంలో ప్రజలకు కనీస అవసరాలు కూడా తీరడంలేదు. అత్యధికులు ఏదో ఒక అసంతృప్తితో, అశాంతితో, అభద్రతా భావాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఇవన్నీ పెరగడానికి ప్రభుత్వ విధానాలే కారణం. కొందరు స్వార్థపరశక్తులు అగ్నికి ఆజ్యంలా వీటిని మరింత పెంచి, పోషిస్తూ ప్రజల్ని మోసగిస్తున్నారు. దీంతో ప్రజలు ఎటూ పాలుపోక ఇటువంటి దొంగబాబాలను నమ్ముతూ తేలికగా తమ కష్టాలను గట్టెక్కవచ్చేమోనని నమ్ముతున్నారు. వీటి నుండి ప్రజల్ని బయటపడేయాలంటే ప్రయోగాల ఆధారంగా విజ్ఞానశాస్త్రం రూపొందించిన విశ్వాసాల ఆధారంగా నిత్యజీవితాన్ని కొనసాగించాలి. దీంతోపాటు రాజ్యాంగంలో నిర్దేశించిన విధంగా అందరిలో శాస్త్రీయ దృక్పథాన్ని, లౌకిక భావాల్ని పెంపొందించుతూ అభివృద్ధి మార్గంలో పయనించడమే అన్ని సమస్యలకూ పరిష్కారం. మూఢవిశ్వాసాల ఆధారంగా ఉన్న బాబాలను, మాంత్రికులను, తాంత్రికులను, చేతబడులు చేసేవారిని, ఇతర దుష్ప్రభోదాలు చేసేవారిని చట్టబద్ధంగా కఠినంగా శిక్షించి, నియంత్రించాలి. చట్టాన్ని ఉల్లంఘించిన వారిని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. మహారాష్ట్రలో వలే వీటిని నియంత్రించడానికి మన రాష్ట్రంలో కూడా ఒక ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలి. ఈ చట్టం కోసం కృషి చేసే బాధ్యత పార్టీలకతీతంగా అన్ని ప్రజాతంత్రవాదులందరి మీద ఉంది.

కొత్తదేవుళ్లా...?

బాబాల పుట్టుపూర్వోత్తరాలు, చరిత్రను పరిశీలిస్తే మొదట వీరు అతి సామాన్యులు. మాయోపాయాలు చేపట్టిన తర్వాత మాత్రమే వీరు బాబాలుగా రూపొంది కొనసాగుతున్నారు. పెద్ద మొత్తాలలో ఆస్థులను కూడబెట్టారు. వీరి కార్యక్రమాలను నిశితంగా పరిశీలించగలిగితే ఇప్పటి చట్టాన్ని, రాజ్యాంగాన్ని వీరు నిత్యం ఉల్లంఘిస్తున్నారు. అందరూ ఏదో ఒక నేరానికి పాల్పడుతున్నవారే. కాని, వీరు ఏశిక్షకు గురికావడం లేదు. ఉదాహరణకు:
సత్యసాయి బాబా:
పుట్టపర్తిలో సత్యసాయిబాబా అంటే బాగా పేరున్న బాబా. మత విశ్వాసాలను, భగవంతునిపై భక్తిని పెంపొందించే రూపంలో బోధనలు చేయడమేకాక, విభూదిని, బంగారు ఆభరణాలనూ, నోట్లో నుండి లింగం తీయడంలాంటి మ్యాజిక్కులను చేస్తూ ప్రజల్ని ఆకర్షిస్తున్నాడు. ఈ మ్యాజిక్కుల బండారమంతా బట్టబయలైంది. వేలకోట్ల ఆస్థిపాస్థులున్నాయి. ఈయనకు ఉన్నత రాజకీయ నేతలతో దగ్గర సంబంధాలున్నాయి. విదేశస్థులతో కూడా సంబంధాలున్నాయి. ఆర్థిక లావాదేవీలు పెద్దఎత్తున నెరుపుతున్నారని వార్తలనేకం వచ్చాయి. ఈయన ఆశ్రమంలో హత్యలు జరిగాయని వార్తలు వచ్చాయి. కానీ, నేరస్థులను శిక్షించినట్లు ఎటువంటి వార్తలు రాకపోవడం గమనార్హం.
నీళ్ల స్వామి:
నీళ్ల స్వామిగా పిలవబడ్డ ఒక స్వామి పూర్వాశ్రమంలో ఇత్తడి బిందెలకు మాట్లు (అతుకులు) వేసుకుని, పొట్టపోసుకున్న వ్యక్తి. ఈయన వేలు ముంచిన నీరు తాగితే అన్ని సమస్యలూ పరిష్కారమవుతాయని ప్రచారం చేయబడింది. ఈ ప్రచారానికి లోనైనవారు తమ సమస్యలన్నీ ఆయనకు చెప్పుకుంటే పరిష్కారమవుతాయని భావించారు. ఇంకేముంది! విద్యావంతులతో సహా ఆయన కటాక్షం కోసం క్యూలు కట్టారు. చివరకు ఆయన ఆశ్రమంలో పారిశుధ్యం లోపించి, భక్తులు విరోచనాల బారిన పడి, రోగగ్రస్థులయ్యారు. నలుగురు చనిపోయారు కూడా. ఆ తర్వాత పోలీసులు రంగప్రవేశం చేసి, చర్య తీసుకున్నారు.
సిగిరెట్‌ బూడిద స్వామి:
ఈయన తాగిన సిగిరెట్‌ బూడిదను ప్రసాదంగా ఇచ్చే బాబా. విజయనగరం జిల్లా వాసి.
కట్టెబాబా:
ఈయన అనంతపురం జిల్లాలో కట్టెతో కాళ్లమీద కొడితే వ్యాధులు నయమవుతాయని ప్రచారం చేశారు.
కంటిచూపు స్వామి:
కంటిచూపుతో క్యాన్సర్‌, ఎయిడ్స్‌తో సహా అన్ని వ్యాధులను నయం చేస్తాడనే బాబా విజయవాడలో వెలిశాడు. 2003, ఫిబ్రవరిలో ఈయనను జనవిజ్ఞాన వేదిక సవాల్‌ చేసింది. సిరీస్‌ కంపెనీ అధినేత జి.ఎస్‌.రాజులాంటి వారు ఈయనకు మద్దతు ఇచ్చారు. అంతిమంగా ఫిబ్రవరి 18న ఈయన బండారం నిరూపితమై, జైలుపాలయ్యారు.
కల్కి విజయకుమార్‌:
విజయకుమార్‌.. కల్కి అవతారంగా తనకు తాను ప్రచారం చేసుకుంటున్నాడు. పూర్తి వివరాలు గత 11.3.2010 సంచికలో ఇవ్వబడ్డాయి.
- సచ్చితానంద స్వామి:
పెద్దఎత్తున అమ్మాయిలతో వ్యాపారం నిర్వహిస్తున్నాడనే ఆరోపణలను ఎదుర్కొంటున్నాడు. అంతేకాకుండా ఇటీవల ఆయన రాసలీలతో కూడిన వీడియోచిత్రాలు టీవీలో ప్రసారితమయ్యాయి.
- ధీరేంద్ర బ్రహ్మచారి:
ఇతను ఆయుధాల వ్యాపారి. ఎన్నో నిషిద్ధ కార్యాక్రమాలతో సంబంధాలున్నట్లు ఈయన ఆరోపణలను ఎదుర్కొన్నాడు. ఈయనకు సొంత విమానాలున్నాయి. ఆఖరకు ఎయిర్‌ క్రాష్‌లో చనిపోయాడు.
కె.ఎల్‌.కాంతారావు జన విజ్ఞాన వేదిక.

ఖగోళశాస్త్ర పితామహుడు..!

చిన్నారి డెస్క్‌ : శాంతిశ్రీ   Sat, 18 Feb 2012, IST  
  • నేడు నికోలస్‌ కోపర్నికస్‌ జయంతి
చిన్నారులూ..! 'విశ్వంలో ఏం జరుగుతుందో..? ఈ భూమి మీద ఇంతమందిమి ఉన్నాం మరి ఇది కుంగిపోదా..?' అని ఇలాంటివే చాలా సందేహాలు మీ బుజ్జి బుర్రల్లో మెదులుతూనే ఉంటాయి. అలాంటి జిజ్ఞాసతోనే ఈ పక్క చిత్రంలో కనిపిస్తున్న 'నికోలస్‌ కోపర్నికస్‌' గొప్ప నిజాన్ని కనిపెట్టాడు. ఇప్పుడు మీలో ఎవర్ని అడిగినా 'సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంద'ని ఠక్కున చెప్పేస్తారు. కానీ దీన్ని నిరూపించడానికి ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్నాడు కోపర్నికస్‌. ఎన్నో ప్రయోగాలు చేశాడు. అందుకు గణిత, ఖగోళశాస్త్రాల్ని మదించాడు. చివరకు భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడనే కన్నా సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుందని అను కుంటేనే రాత్రీ పగలుకూ, మారుతున్న ఋతువులకూ కారణాలు సులభంగా అర్థమవుతాయ న్నాడు. అంతేకాదు ఆ వాస్తవాన్ని లెక్కలతో సహా నిరూపించాడు. తన పరిశోధనాసారం ప్రపంచానికి ఎలా ఉపయోగపడిందో ఆయనైతే చూడలేకపోయాడు. కానీ మనం మాత్రం ఆ వాస్తవాన్ని గ్రహించి, మరింత ముందుకుపోతున్నాం. ఈ నిజాన్ని అంగీకరించడానికి నాటి మత వాదులు ఏమాత్రం ఇష్టపడలేదు. కానీ నేడు అదే వాస్తవమైంది. సైన్స్‌ ఏదైనా ప్రయోగాత్మకంగా రుజువైనవే వాస్తవమని నమ్ముతుంది. ప్రయోగాత్మకంగా ఋజువు చేయడం అంత ఆషామాషీ కాదు. అందుకెంతో కృషి చేయాలి. అంత మేధోమథనం చేశాడు గనుకే 'నికోలస్‌ కోపర్నికస్‌' ఖగోళ పితామహుడయ్యాడు. మరి ఆయన గురించి తెలుసుకుందామే..!
'నికోలస్‌ కోపర్నికస్‌' 1473, ఫిబ్రవరి 19న జన్మించాడు. తండ్రి రాగి వ్యాపారం చేసేవాడు. నలుగురి పిల్లల్లో 'కోపర్నికస్‌' ఆఖరివాడు. 'కోపర్నికస్‌'కు పదేళ్లప్పుడే తల్లీతండ్రీ ఇద్దరూ మరణించారు. మేనమామ 'లుకాస్‌ వాజెన్‌రోడ్‌' పెంచి పెద్దచేశాడు. ఆయన గొప్ప విద్యావేత్త. న్యాయశాస్త్రంలో 'బోలాగ్నా' యూనివర్శిటీ నుండి డాక్టరేట్‌ పొందాడు. 'పర్మియా'లో బిషప్‌ కూడా. సామాజిక హోదా, డబ్బుకు లోటు లేకపోవడంతో తెలివైన 'కోపర్నికస్‌'ను బాగా చది వేందుకు ప్రోత్సహించాడు. 'కోపర్నికస్‌' 'క్రాకౌ' యూని వర్శిటీలో రెండేళ్లు చదువుకున్నాడు. ఆ తర్వాత 'ఫ్రంబర్క్‌' చర్చిలో మతాధికారిగా ఉద్యోగం వచ్చింది. చర్చిలో ఎక్కువ సమయం ఉండాల్సిన అవసరం లేకపోవడంతో మరో 12 సంవత్సరాలు చదువు కొనసాగించాడు.
యూరప్‌లో 15వ శతాబ్ది ఆరంభం నాటికి కొత్త మార్గాలు, ప్రాంతాల అన్వేషణ ముమ్మరంగా మొదలైంది. కొందరు అప్పటికే కొత్త ప్రాంతాలను అన్వేషించారు. రాజులు, ప్రభువుల పాలన పోయే దిశగా సమాజంలో మార్పు జరుగుతోంది. మేధోమథనం ఆరంభమైంది. ఇది 'కోపర్నికస్‌'లోనూ ప్రారంభమైంది. ముద్రణ పద్ధతి అమల్లోకి రావడంతో పుస్తకాలూ అందుబాటులోకి వచ్చాయి. కనపడిన ప్రతి పుస్తకాన్నీ 'కోపర్నికస్‌' చదివేవాడు. గణిత, ఖగోళశాస్త్రాలపై ఎక్కడ ఉపన్యాసాలున్నా హాజరయ్యేవాడు.
ఈ కొత్త భావాలకు అప్పట్లో ఇటలీ కేంద్రంగా ఉండేది. క్రమంగా ఆ భావాలు ఇతర దేశాలకూ వ్యాపించాయి. 1496లో 'బోలోగ్నా' యూనివర్శిటీలో 'కోపర్నికస్‌' చేరాడు. ఆ తర్వాత 'పడువా', 'ఫెరార' యూనివర్శిటీల్లో చదివాడు. 'జీవితం, కళ, తత్వ శాస్త్రాల'పై తమ తమ అభిప్రాయాలను లేఖల రూపంలో రాసి, వాటినే పంచేవారు. వాటిని 'కోపర్నికస్‌' ఆసాంతం చదివేవాడు. న్యాయశాస్త్రాన్ని చదువుతున్నా ఆయన ధ్యాసంతా 'ఖగోళ, గణితశాస్త్రాల'పైనే ఉండేది. ఆయన 'గ్రీకు భాషను, వైద్యం, తత్వశాస్త్రం, రోమన్‌ చట్టాన్ని' కూడా అధ్యయనం చేశాడు. 'బోలోగ్నా' యూనివర్శిటీ లోనే ప్రముఖ ఖగోళశాస్త్రవేత్తలు 'డోవినికో', 'డానొవోరా' పరిచయమయ్యారు. 'డానొవోరా' సహకారంతో ఖగోళ పరిశోధనల్లో కిటుకులు తెలుసుకున్నాడు. 'కోపర్నికస్‌' అన్వేషణకు ఇక్కడే పునాది పడింది. విమర్శనాత్మకంగా విషయాల్ని పరిశీలించే అలవాటు 'కోపర్నికస్‌'కు చిన్న ప్పటి నుండీ ఉంది. 'టాలెమీ' సిద్ధాంతాల్లో వాస్తవాన్ని అనుమానించటమే కాక, ప్రత్యామ్నాయం కోసమూ అన్వేషించాడు.
న్యాయశాస్త్రంలో 1503లో డాక్టరేట్‌ పొంది, 'ఫ్రంబర్గ్‌' వెళ్లాడు. ఈలోపు మేనమామ అస్వస్థతకు గురైతే 1506-12 వరకూ అక్కడే ఉన్నాడు. ఈ ఆరేళ్లల్లో ఎన్నో ఆలోచనలు చేశాడు. 'టాలెమి' ప్రతిపాదనల్ని వందలసార్లు పరిశీలించాడు. చివరికి 'సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని' చిత్తుగా తయారుచేశాడు. 1514లో ఈ విషయాన్ని మిత్రులు కొందరికి అందజేశాడు. అదే తర్వాత 'ఆన్‌ ద రివెల్యూషన్‌ ఆఫ్‌ ద సెలెస్ట్రియల్‌ స్పియర్స్‌' గ్రంథంలో వివరించాడు.
'ఫ్రంబర్గ్‌' నుంచి తిరిగొచ్చాక ఇంటి పైకప్పు మీద ప్రయోగశాలను ఏర్పాటు చేసుకుని, ఖగోళ పరిశోధన లు జరిపాడు. తన ప్రతిపాదనల్నే పదేపదే తార్కికంగా పరిశీలించాడు. చివరికి తన సిద్ధాంతమే వాస్తవాన్ని ప్రతిబింబిస్తోందనే నిర్ణయానికి వచ్చాడు. సూర్యుడితో పాటు ఇతరగ్రహాలు భూమి చుట్టూ తిరుగుతున్నట్లు అరిస్టాటిల్‌, టాలెమి ఎందుకు భావించారో 'కోపర్నికస్‌' కు అర్థమైంది. భూమి నిర్దిష్ట కక్ష్యలో 24 గంటలకోసారి తనచుట్టూ తాను తిరగటంతో సూర్యుడూ, ఇతర గ్రహాలూ భూమి చుట్టూ తిరుగుతున్నట్లు వారు భ్రమించారని నిర్ణయానికొచ్చాడు. ఒక్క చంద్రుడే భూమి చుట్టూ తిరుగుతున్నాడని ఆయన ప్రతిపా దించాడు. అంగారకుడు, బృహస్పతి, శని గ్రహాలు భూమి కంటే దూరంగా సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయని చెప్పాడు. దీనికి ఆకర్షితుడైన జర్మనీ గణితశాస్త్రవేత్త 'రెటికస్‌' 1539లో 'కోపర్నికస్‌'ని చూడటానికి 'ప్రంబర్గ్‌'కి వెళ్లాడు. 'రెంటికన్‌' ఎంత బతిమాలినా వాటిని ప్రచురించటానికి 'కోపర్నికస్‌' అంగీకరించలేదు. చివరికి 1540లో 'కోపర్నికస్‌' సిద్ధాంతాన్ని 'రెటికస్‌' స్వయంగా ప్రచురించాడు. ఆ పుస్తకం వెలుగులోకి వచ్చినరోజే 1543, మే 24న 'కోపర్నికస్‌' మరణించాడు. మిత్రులు ఆ పుస్తక ప్రతిని ఒకదాన్ని ఆయన చితిపై పెట్టారంట! ఏమైనా 'విజ్ఞానశాస్త్రం'లో ఇదే అంతిమం అనేదేమీ ఉండదు. నిరంతర ప్రయోగాత్మక ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. అదే విజ్ఞానశాస్త్ర పురోగమనం తీరు..!
మరి ఇంత గొప్ప విషయాన్ని కనిపెట్టిన
'నికోలస్‌ కోపర్నికస్‌'కు జేజేలు చెప్పేద్దామే..

సైన్స్‌సైట్ -- వైద్య చికిత్సలో కిరణాలు

  • 19/02/2012
  •   |  
  • సి.వి.సర్వేశ్వర శర్మ
నోబెల్ బహుమతి గ్రహీత సి.వి.రామన్ 1928లో ఒక బలహీనమైన వికిరణాన్ని
 కనుగొన్నారు. దానినే రామన్ వికిరణం అంటారు. ఆనాటి నుండి ఈ రామన్
 వికిరణం భౌతిక, రసాయన ప్రయోగాల్లో ఎంతో ఉపయోగపడుతోంది.
ఇప్పుడు అమెరికాలోని శాస్తవ్రేత్తలు ఈ రామన్ స్పెక్ట్రో స్కోపిని ఉపయోగించి
గుండె ధమనుల్లో వున్న ప్లేక్స్ (రక్త ప్రవాహాన్ని నిరోధించే పదార్థాలు) రసాయనిక
తత్త్వాన్ని అంచనా వేయగలిగారు. ధమనుల్లో ప్లేక్స్ పేరుకుపోయిన కొలది
రక్తప్రవాహం మందగిస్తుంది. హృదయ ధమనుల్లో ప్లేక్స్ ఒకే స్థాయిలో ఉండవు.
ఒకచోట ఎక్కువగాను, మరొకచోట తక్కువగాను ఉంటాయి. ప్లేక్స్ వల్ల అప్పుడప్పుడు
 గుండె నొప్పి రావడం, ధమనుల గోడలు చిట్లడం జరుగుతుంది. ఒక్కొక్కసారి రక్తం
గడ్డ కట్టే ప్రమాదం కూడా ఉంటుంది. ప్రమాదకరమైన ఈ ప్లేక్స్ రకరకాల రసాయనాలు
కలిసి ఏర్పడతాయి. ప్లేక్స్‌లోని రసాయనాలు తెలుసుకోగలిగితే, అవి ధమనుల గోడలు
చీలుస్తాయా లేదా అనే విషయాన్ని, వాటిని తొలగించడానికి కావలసిన చికిత్సా
విధానాన్ని నిర్ధారించవచ్చు. రోగి మరణించాక గాని ధమనుల్లో ఇరుక్కున్న ప్లేక్స్
రసాయనిక తత్త్వాన్ని పసిగట్టడం సాధ్యమయ్యేది కాదు. ధమనిలో ప్లేక్స్ ఉన్న
చోటుకి చొచ్చుకొని వెళ్లి కావలసిన సమాచారాన్ని అందించే పరికరాలు కరువయ్యాయి.
ఇలాంటి చోటనే రామన్ కిరణాలు అక్కరకు వస్తున్నాయని అమెరికన్ శాస్తవ్రేత్తలు ప్రకటించారు.
విశే్లషణ ఒక రసాయనిక పదార్థం నుండి వచ్చే కాంతిని విశే్లషించి ఆ పదార్థాన్ని
నిర్ధారించడం స్పెక్ట్రోస్కోపితో సాధ్యం. ఒక రసాయన పదార్థం మీదికి లేజర్ కాంతిని
ప్రసారం చేసినపుడు అందులోని అణువులు కాంతిని గ్రహించి, తిరిగి పరావర్తనం
చెందేలా చేస్తాయి. ముందు ప్రసరింపజేసిన కాంతి తరంగాల వేవ్‌లెంగ్త్‌కు, రసాయనిక
పదార్థం నుండి వెనుదిరిగి వచ్చిన కాంతి తరంగాల వేవ్‌లెంగ్త్‌కు తేడా ఉంటుంది.
ఈ పరావర్తన కాంతి వర్ణ పటాన్ని గమనిస్తే ఆ పదార్థంలోని రసాయన మూలకాలు
తెలుసుకోవచ్చునని రామన్ సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని ఎన్నో ఏళ్లుగా రసాయన
శాస్తవ్రేత్తలు ఉపయోగిస్తున్నారు. ఈ సిద్ధాంతం హృద్రోగ చికిత్సలో సైతం కీలకమవుతోంది.
పరిశోధకులు ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నవారి పాత గుండె ధమనులను పరీక్షించారు.
తరువాత దశలో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకుంటున్న వారి ధమనుల్లో ప్లేక్స్‌ను
రామన్ స్పెక్రోస్కోపి ద్వారా పరిశీలించారు. గుండె జబ్బులతో బాధపడుతున్న మిగిలిన
వారికి మరో విధానాన్ని అనుసరించారు. మూత్రనాళిక గుండా ఆప్టిక్ ఫైబర్‌ను ధమనుల్లో
సమస్యవున్న ప్రదేశానికి పంపిస్తారు. బయట నుండి లేజర్ కాంతిని ఆప్టిక్ ఫైబర్ మీదకు
ప్రసరింపజేస్తారు. పరావర్తనం చెందిన కిరణాలను మూత్రనాళికలో మరొక వైపునున్న
 డిటెక్టర్ పరిశీలిస్తుంది. బలహీనమైన రామన్ వికిరణాల సంకేతాలను పసిగట్టే సున్నితమైన
డిటెక్టర్‌ను తయారుచేయడం వంటి చిన్నచిన్న సమస్యలు ఇంకా అధిగమించాల్సి ఉంటుంది.
ప్రోటాన్ కిరణాలు అణు భౌతిక పరిశోధనలో ఉపయోగించే ప్రోటాన్ కిరణాలు వివిధ రకాల
కేన్సర్లను సమర్థవంతంగా తగ్గిస్తున్నట్లు అమెరికా పరిశోధకులు వెల్లడించారు. ఈ కిరణాలు
కేన్సర్ కణితి సమీపంలోని కణజాలానికి ఎటువంటి హాని కల్గించవు. ప్రోస్టేట్, ఎముక, కంటి
కేన్సర్ చికిత్సలో ఇప్పటివరకు రేడియో ధార్మిక వికిరణాలను ఉపయోగిస్తున్నారు.
ఈ వ్యాధులను ప్రోటీన్ కిరణాలతో చికిత్స చేసినపుడు మరింత ఉత్తమమైన ఫలితాలు
లభించాయని అమెరికన్ వైద్య పరిశోధకులు చెబుతున్నారు. కేన్సర్ కణితి గుండా ఒకే స్థాయిలో
వికిరణ డోస్ పంపుతారు. అదే సమయంలో కణితి  పరిసరాల్లోని ఆరోగ్యవంతమైన కణజాలం
దెబ్బతినకుండా చూసేందుకు జీరో డోస్‌లో రేడియో ధార్మిక వికిరణాలను పంపుతారు.రేడియేషన్
థెరపీలో ఉపయోగించే ఫోటాన్ కిరణాలు శరీరం గుండా ప్రయాణించే సమయంలో కొంత శక్తిని
కోల్పోతాయి. అంతేగాక కిరణాలు శరీరంలోకి ప్రవేశించవలసిన చోట చర్మంపై అత్యధికంగా
కేంద్రీకృతమవుతాయి. శరీరం మందాన్నిబట్టి లోనికి ప్రవేశించాల్సిన కిరణాల్లో కొన్నింటి శక్తి
క్షీణిస్తుందని పరిశోధకులు గమనించారు. కేన్సర్‌కు గురైన ప్రోస్టేట్ గ్రంథిని శస్తచ్రికిత్స ద్వారా
తొలగించినపుడు కలిగిన ఫలితమే ప్రోటాన్ కిరణాల చికిత్సలో కూడా లభించడం
విశేషమంటున్నారు ఈ వైద్య పరిశోధకులు.

దోమ తెరలు వాడండి ఐదు జబ్బులు నిరోధించండి

Share రక్ష డెస్క్   Mon, 20 Feb 2012, IST  
* దోమ కుట్టడం వల్ల మనం 5 ప్రమాదకర వ్యాధులకు గురవుతాం.
* అవి మలేరియా, డెంగీ జ్వరం, మెదడువాపు, చికున్‌గున్యా, బోధ వ్యాధి.
* మలేరియా, డెంగీ, మెదడువాపు వాపుతో మరణం సంభవించొచ్చు.
* చికున్‌గున్యా దీర్ఘకాలం నొప్పులతో బాధపెడుతుంది. బోధ వ్యాధి దీర్ఘకాలం వైకల్యాన్ని కలిగిస్తుంది.
* దోమ తెరలు వాడటం వల్ల మనం ఈ ఐదు వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు.
* 18వ శతాబ్దంలోనే దోమతెరలు వాడారట. ఈజిప్టు మహారాణి క్లియోపాత్ర తెరలోపలే నిదురించేదట.
* సూయజ్‌ కాల్వ నిర్మాణంలో అక్కడ పనిచేసే వారికి మలేరియా ఎక్కువగా వచ్చేదట. వారు దోమ తెరలు వాడి మలేరియాను తగ్గించుకున్నారట.
* సాధారణంగా మనం దోమతెరలు నూలు, నైలాన్‌, పాలిఎస్టర్‌ దారంతో చేస్తాం.
* ఇప్పుడు దోమల జబ్బుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా 'క్రిమి సంహారక మిలిత దోమ తెరలు' , 'చిరకాలం మన్నే క్రిమిసంహారిణి దోమతెరలు' అందుబాటులోకి వచ్చాయి. మన దేశంలో వీటిని ప్రభుత్వం ఎంపిక చేసిన ప్రాంతాలలో ఉచితంగా పంపిణీ చేస్తుంది. ఇవి దోమలను దగ్గరకు రానివ్వవవు. దోమలను చంపెస్తాయి

నెలల పేర్లు

డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్‌


స్కూళ్ళు తెరిచేదెప్పుడో, పరీక్షల కెన్నాళ్ళున్నాయో, వేసవి సెలవలు ఎప్పుడొస్తాయో అన్నీ తెలుసుకోవడానికి మనం నెలలు లెక్క పెడుతూ ఉంటాం. భూమి సూర్యుడి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి ఏడాది అవుతుంది. ఒక ఏడాది అంటే 365 రోజులనుకుంటాం కాని ఖచ్చితంగా చెప్పాలంటే అది 365 రోజుల, 5 గంటల, 48 నిమిషాల, నలభై అయిదున్నర సెకండ్ల వ్యవధి. సంవత్సరానికి పన్నెండు నెలలనీ, వాటికి ఇంగ్లీషులో జనవరి, ఫిబ్రవరి వగైరా పేర్లుంటాయనీ మీకు తెలిసినదే. ఇవి కాక మనవాళ్ళు ఉగాది నుంచీ చైత్రం, వైశాఖం మొదలైన పేర్లతో 12 నెలలు లెక్క పెడుతూ ఉంటారు. టైము ఆగకుండా నడుస్తూనే ఉంటుంది కాని మన వీలును బట్టి దాన్ని నిమిషాలూ, గంటలూ, రోజులూ, నెలలూ, సంవత్సరాలుగా లెక్కపెట్టుకుంటాం. అసలీ నెలల పద్ధతి ఎప్పుడు, ఎలా మొదలైంది?

లక్షల సంవత్సరాల నుంచీ మనుషులు ఆకాశంలో సూర్యుణ్ణీ, చంద్రుణ్ణీ, నక్షత్రాలనూ గమనిస్తూనే ఉన్నారు. చంద్రబింబం నెలకొకసారి అమావాస్య రోజున కనబడకుండా పోతుందనీ ఆ తరవాత క్రమంగా పెద్దదై పౌర్ణమి నాటికల్లా పూర్తిగా కనిపిస్తుందనీ వారు తెలుసుకున్నారు. చంద్రుడి కళలను బట్టి లెక్క పెట్టేవే నెలలు. అందుకే చందమామను నెలవంక అని కూడా అంటారు. మొదట్లో ఈ పద్ధతిలోనే లెక్క పెట్టేవారు. ఎటొచ్చీ కేవలం చంద్రుడిని బట్టి పన్నెండు నెలలు లెక్క కడితే ఏడాదికి 354 రోజుల పదకొండుంబాతిక రోజులే వస్తాయి. ప్రకృతిలో రుతువుల్లోని మార్పులన్నీ సూర్యుడి గమనాన్ని బట్టే కలుగుతాయి కనక చంద్రుడి ఆధారంగా నెలలను లెక్కపెట్టే పద్ధతి సరిగ్గా అనిపించలేదు. ఆధునిక పద్ధతిలో నెలలను ఆ రకంగా లెక్కించరు. 28 నుంచి 31 రోజుల దాకా నెలల వ్యవధి రకరకాలుగా ఏర్పాటయి ఉంటుంది.

పురాతన కాలంలో ఇప్పటి ఇరాక్‌ ప్రాంతంలో విలసిల్లిన సుమేరియన్‌ నాగరికతలో ఏడాదికి 12 నెలలనీ, నెలకు 30 రోజులనీ లెక్కించేవారు. ప్రాచీన ఈజిప్ట్‌లోనూ అదే పద్ధతి ఉండేది కాని చివరలో అదనంగా 5 రోజులు చేరుస్తూ ఉండేవారు. క్రీ.పూ.238లో నాలుగేళ్ళ కొకసారి ఒక రోజును చేర్చుకోవాలనే పద్ధతిని వారు ప్రవేశపెట్టారు. లీప్‌ సంవత్సరంగా ఇప్పటికీ అది అమలులో ఉంది. క్రీ.పూ. ఏడో శతాబ్దం దాకా రోమన్‌ కేలండర్‌ పద్ధతిలో ఏడాది మార్చ్‌లో మొదలై పది నెలలపాటే కొనసాగేది. ఆ తరవాత జనవరి, ఫిబ్రవరి నెలలను చేర్చుకున్నారు. అయినప్పటికీ కొన్ని నెలలకు 29, కొన్నిటికి 30 చొప్పున రోజులుండేవి కనక అంతా తికమకగా తయారయింది. క్రీస్తు పుట్టుకకు 45 ఏళ్ళ క్రితం జూలియస్‌ సీజర్‌ అనే రోమన్‌ నేత ఈ వ్యవహారాన్ని సరిదిద్ది, ఇప్పుడు మనం పాటిస్తున్న పద్ధతిని ప్రవేశపెట్టాడు. తాను పుట్టిన తేదీని బట్టి ఆనాడు క్వింటిలిస్‌ అనే పేరున్న నెలకు తన పేరు పెట్టి జూలైగా మార్చాడు. అతని తరవాత అధికారం చేపట్టిన ఆగస్టస్‌ సీజర్‌ ఆ తరవాతి నెలను ఆగస్ట్‌గా మార్చాడు. ఈ జూలియన్‌ కేలండర్‌ లెక్కకూ, సూర్యుడి గమనానికీ 11 నిమిషాల పైగా తేడా ఉండేది. ఇది శతాబ్దాల పాటు పెరిగి కొంత గందరగోళం కలిగించింది.

పదహారో శతాబ్దంలో గ్రిగొరీ అనే రోమన్‌ మతాధికారి పోప్‌గా వ్యవహరిస్తున్నప్పుడు 1600 సంవత్సరాన్ని లీప్‌ సంవత్సరంగా నిర్ణయించాడు. ఈ గ్రిగోరియన్‌ పద్ధతిని అన్ని దేశాలూ అనుసరించడంతో ఇప్పటికీ అదే కొనసాగుతోంది. ఇందులో సంవత్సరాలన్నిటినీ ఏసు క్రీస్తు పుట్టిన సంవత్సరం నుంచీ లెక్కిస్తారు. దీనికి భిన్నంగా యూదు మతస్థులు గత 1200 ఏళ్ళుగా హీబ్రూ కేలండర్‌ను అనుసరిస్తున్నారు. వారి లెక్కన సృష్టి అనేది క్రీ.పూ.3761లో మొదలైంది. ఇస్లామ్‌ మతంలో క్రీ.శ.622 నుంచీ లెక్కిస్తారు. హిందూ పద్ధతిలో ప్రస్తుతం శాలివాహన శక సంవత్సరం 1928 నడుస్తోంది. ఇదే విక్రమ సంవత్సరం 2062 అవుతుంది.

జనవరి అనే నెల జానస్‌ అనే రోమన్‌ దేవత పేరున ప్రారంభమైంది. అలాగే ఫిబ్రవరి అనేది ఫెబ్రువా అనే రోమన్‌ దేవత వల్ల వచ్చింది. ఇందులో మొదట 29 రోజులుండేవి కాని ఇందులోంచి ఒకటి తగ్గించి ఆగస్ట్‌లో చేర్చారు. మార్చ్‌ అనేది యుద్ధాలకు అధిదేవత అయిన కుజుడి పేరుతో (మార్స్‌) ఏర్పడింది. ఏప్రిలిస్‌ అనే మాట నుంచి ఏప్రిల్‌ నెల పేరు వచ్చింది. ఇది (అపెరీరె) ప్రారంభాన్ని సూచిస్తుందని అంటారు. మేయెస్తా అనే రోమన్‌ దేవత వల్ల మే నెల పేరు వచ్చి ఉండవచ్చు. జూన్‌ అనే పేరుకు రోమన్‌ దేవత జూనో కారణమనీ, జూనియస్‌ అనే తెగ కారణమనీ రకరకాల ప్రతిపాదనలున్నాయి. పైన చెప్పినట్టుగా జూలై, ఆగస్ట్‌ నెలలకు రోమన్‌ చక్రవర్తుల పేర్లు ఆధారం. మొదట్లో సెప్టెంబర్‌ ఏడో నెలగా ఉండేది. సంస్కృతానికీ, లాటిన్‌ భాషకూ పోలికలున్నాయి. సంస్కృతంలో ఏడు, ఎనిమిది వగైరా సంఖ్యలను సప్తమ, అష్టమ, నవమ, దశమ అంటారు కనక ఈ శబ్దాలను పోలిన పేర్లుగా సెప్టెంబర్‌, అక్టోబర్‌, నవంబర్‌, డిసెంబర్‌ కనబడతాయి. మొత్తం మీద సూర్య చంద్రుల కదలికలోని తేడాలవల్ల నెలలన్నీ తలొక రకంగా రూపొందాయి. ఇది కాక నాలుగేళ్ళకొకసారి ఏడాదికి ఒక రోజు కలుపుకుంటూ ఉంటాం.

ఇంగ్లీషు నెలల పేర్లతో బాటు మనవాళ్ళు పెట్టుకున్న పేర్లు కూడా మనం మరచిపోకూడదు. వాటిని మరొక్కసారి గుర్తు చేసుకుందాం చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం. మీ స్నేహితులకు కూడా ఇవి నేర్పించండి.