Wednesday 7 November 2012

పచ్చి 'శాకాలు' మనకి కావు..!

పచ్చి ఆకుకూరలూ, కూరగాయలూ తింటే బోలెడు ఆరోగ్యం అని చాలా మంది అంటుంటారు. ఇంకొందరు ఇంకాస్త ముందుకెళ్ళి అసలు పచ్చిపాలు, పచ్చి గింజలూ తినమని సలహా ఇస్తుంటారు. పైగా, ఇలా చేస్తే మన జీర్ణవ్యవస్థతో పాటు మన మెదడుకు కూడా మేలు జరుగుతుందని చెబుతారు. ఇప్పుడు అందుకు భిన్నంగా ఫలితాలు వచ్చాయి. మనిషి పచ్చి ఆహారం తింటే రోజుకు తొమ్మిది గంటలు ఆహారం తింటూనే ఉండాలట. ఎందుకంటే అంతసేపు తింటేగానీ మన శరీరానికి అవసరమైన పోషకాలు అందవట. మనకి ముందుగా వచ్చిన మహా వాన రాలు- గొరిల్లాలు, చింపాంజీలూ ఎక్కువగా పచ్చి ఆహారంపైనే ఆధారపడతాయి. వాటి తరువాత వచ్చిన మన పూర్వీకులు వాటికంటే మూడింతలు ఎక్కువ మెదడులో నాడులు కలిగి వుండేవాళ్ళు. అందుకు కారణం వాళ్ళు ఆహారాన్ని ఉడకబెట్టడం (నిప్పుల మీద) నేర్చుకున్నారు. ఈ విషయాలు ప్రొసీడింగ్స్‌ ఆఫ్‌ ది నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌లో ప్రచురితమయ్యాయి. వట్టి పచ్చి కూరలే తింటే మెదడు పెరుగుదలకు తోడ్పడేంత కాలరీలు అందవని, పెరిగిన మెదడుకు ఉడికించిన ఆహారమే కారణమని ఈ పరిశోధకులు గమనించారు.

No comments:

Post a Comment