Wednesday 7 November 2012

ఎరుపే కాదు.. చెరుపు కూడా!


తాంబూలం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుందని ఒక నమ్మకం. పైగా మనం కొన్ని వందల రకాల పాన్‌ (కిళ్లీ) లను నమిలి పారేస్తాం. ఇప్పుడు జీర్ణశక్తి సంగతేమోగానీ, పాన్‌ వల్ల ఏకంగా నోటి కాన్సర్‌ వచ్చే ప్రమా దం మెండుగా ఉందని భావిస్తు న్నారు. పాన్‌లో పచ్చి వక్కలు, ఇతర సుగంధద్రవ్యాలు విరివిగా వాడతాం. అటువంటి వక్కలోనే మన జన్యు పదార్థాన్ని మార్చేసే గుణం ఉందని తెలిసింది. తద్వారా, క్యాన్సర్‌ రావచ్చు. వక్క పలుకలు మన డిఎన్‌ఎను ఆల్కలైట్‌ చేయడం ద్వారా ప్రమాదం కలిగిస్తాయని ఒక రసాయన పరిశోధకపత్రంలో ప్రచురించారు. ఆసియాలో ముఖ్యంగా చైనా, భారత్‌, పాకిస్తాన్‌లలో పాన్‌ తినే అలవాటు ఎక్కువ. అందువల్ల, వారు నోటి క్యాన్సర్‌ కలిగించే ఈ పాన్‌ని మితంగా వాడితే మంచిది.

No comments:

Post a Comment