Sunday 16 September 2012

గురజాడ జయంత్యుత్సవాలు 2లక్షల కరపత్రాలు.. లక్ష పోస్టర్లు


  • ఎమ్మెల్సీ బాలసుబ్రమణ్యం
'దేశమంటే మట్టికాదోరు.. దేశమంటే మనుషులోరు..' గేయ రచయిత గురజాడ 150వ జయంతి ఉత్సవాల ప్రచారానికి జనవిజ్ఞాన వేదిక ఆధ్వరంలో రెండు లక్షల కరప్రతాలు, లక్షల పోస్టర్లు వేయనున్నట్లు ఎమ్మెల్సీ బాలసుబ్రమణ్యం తెలిపారు. గురజాడ 150వ జయంతి సందర్భంగా దేశభక్తి పోస్టర్‌ను ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంఘిక, సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడిన వైతాళికుడని అన్నారు. అభివృద్ధి అంటే మనిషికి కూడు, గూడు ఉండాలనీ, సాటి మనిషిని ప్రేమించడం దేశభక్తి అనీ చాటిచెప్పారన్నారు. జెవివి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ప్రొఫెసర్‌ కె.సత్యప్రసాద్‌, ఎన్‌.శంకరయ్య మాట్లాడుతూ మనిషి కేంద్రంగా దేశభక్తి గేయాన్ని రచించిన ఘనత గురజాడకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జెవివి విద్యా విభాగం కన్వీనర్‌ ఎన్‌. వెంకటేశ్వర్లు, కోశాధికారి సి. మోహన్‌, నాయకులు రాజా, శ్రీనాథ్‌, సర్వేశ్వరరావు పాల్గొన్నారు.

No comments:

Post a Comment