Friday 17 August 2012

ప్రత్యామ్నాయ పత్తి సేద్యం..


గుంటూరు జిల్లాలో ఇటీవల ఏర్పడిన పరస్పర సహకార సంఘం ఆధ్వర్యంలో 26 మండలాల్లో 58 గ్రామా ల్లో రెండువందలకు పైగా రైతులు బిటి పత్తికి ప్రత్యామ్నాయంగా మామూలు హైబ్రిడ్‌ పత్తిని సుస్థిర సాంకేతిక ప్రక్రియ లతో చేపట్టారు. వీటిలో కీలకాంశాలు...
* పత్తిని ఏక పైరుగా కాక మిశ్రమ / అంతర పైరుతో సాగు చేయాలి.
* భూసారాభివృద్ధికి ప్రయోజనకర జీవుల్ని పెంచగల 'అలసంద' (లేక ఇతర లెగ్యూమ్‌ జాతి పైరు) వంటి పైరును పత్తిలో అంతర పంటగా వేయాలి.
* రసాయన ఎరువులకు తక్కువ ప్రాముఖ్యతనిచ్చి, సేంద్రీయ ఎరువుల వినియోగాన్ని పెంచాలి.
* బాక్టీరియా బూజులవంటి జీవుల ద్వారా పైరుకు అందించే నత్రజని, భాస్వరాల్ని కూడా పొదుపు చేసుకోవాలి. వాటి కల్చర్లను విత్తనాలకు కలపాలి.
* ఆముదం, బంతి వంటి ఎర పంటల ద్వారా పొలాల్లో వైవిధ్యతను పెంచాలి.
* పురుగుల వలసల్ని ఆపగలిగే జొన్న వంటి పైరును పత్తి చేను సరిహద్దుల్లో వేయాలి.
* పంచగావ్య (ఆవు మూత్రం), జీవామృతం, వేప కషాయం వంటి సహజ రసాయ నాల్ని పురుగు, తెగుళ్ల అదుపుకు వాడాలి.
* ఎంతో అవసరమైనప్పుడు మాత్రమే కృత్రిమ రసాయనాల జోలికి వెళ్లాలి.
* పురుగులపై నిఘా ఉంచుతూ లింగాకర్షణ ఎరల్ని వాడాలి.
* పురుగుల్ని తినే పక్షుల్ని ప్రోత్సహించగల పక్షి స్థావరాల్ని ఏర్పరచాలి.
* పత్తి మొక్కలు ఏపుగా పెరిగిన తర్వాత (65-70 రోజులు) తలల్ని, (పై రెమ్మల్ని) తుంచితే పురుగుల ఉధృతి తగ్గుతుంది. కాబట్టి వీటిని తెంచాలి.
* అనుభవజ్ఞులతో, తోటి రైతులతో నిత్యం చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి.
* పత్తి పొలం నుండి వచ్చిన ఆకు, కట్టెలను పొలంలోనే దున్నేయాలి.
* మరుసటి సంవత్సరం, వీలైన చోటల్లా పంట మార్పిడి చేయాలి.
మీకు తెలుసా..?
శ్రీ విత్తనం : క్రోడీకరించిన సంక్షిప్త సాంకేతిక విజ్ఞానం.
సవరణ: 'గతవారం'జీవనధార మందులు.. అవరోధాలు..అవకాశాలు..' లో 'నాణ్యత పోలిక' బాక్స్‌ఐటమ్‌లో 270 ప్రయోగాలు అని వచ్చింది. దీనిని 2,070 ప్రయోగాలుగా సవరించి చదువుకోవలసిందిగా మనవి. అసౌకర్యానికి చింతిస్తున్నాం. - విజ్ఞానవీచిక డెెస్క్‌
గమనిక: ఈ పేజీపై మీ స్పందనలను
9490098903కి ఫోను చేసి తెలియజేయండి.

No comments:

Post a Comment