Wednesday 4 July 2012

తియ్యటి పరిష్కారం..!



                   కృత్రిమంగా కణజాలాన్ని రూపొందించడంలో శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. ఇప్పటివరకూ కణజాలంలోని సూక్ష్మ రక్తనాళాలని రూపొందించడానికి కొన్నిరకాల అచ్చులు (మౌల్డులు) వాడుతున్నారు. కానీ, వాటిని తొలగించడం మరీ ఇబ్బందిగా మారుతోంది. ఉదాహరణకు రబ్బరుతో చేసిన అచ్చులను తొలగించడానికి రసాయనాలు వాడవలసి ఉంటుంది. దాంతో సృష్టించిన కణజాలం దెబ్బతినే ప్రమాదం అధికంగా ఉంది. ఇప్పుడు ఈ సమస్యకు ఒక 'తీయని' పరిష్కారం లభించింది. నీటిలో కరిగే ఓ ప్రత్యేక పదార్థాన్ని ('గాజు') ని కేక్‌లు, ఇతర స్వీట్లపై అలంకరణకు వాడుతుంటారు. ఆ కార్బొహైడ్రేట్‌ పదార్థాన్ని వాడి 'అచ్చు'లు చేయడం వల్ల, పని పూర్తయ్యాక వాటిని తొలగించడం సులభం అని అంటున్నారు. కణాలలోని తేమకే ఆ పదార్థం కరిగిపోతుందట!

No comments:

Post a Comment