Wednesday 20 June 2012

అడుగంటుతున్న భూగర్భజలాలు..!


ప్రపంచవ్యాప్తంగా భూగర్భజలాలు అడుగంటుతున్నాయని పరిశోధనలు చెబుతున్నాయి. గత తొమ్మిది సంవత్సరాలుగా ఇటువంటి ప్రక్రియ జరుగుతోందని అంటున్నారు. ఈ తరహా తగ్గుదల మన దేశంతో సహా కాలిఫోర్నియా, చైనా, మధ్య ప్రాచ్య ప్రాంతాలలో మరింత ఎక్కువగా ఉందని తేలింది. అందుకు కారణం ఈ నీటిలో విస్తరిస్తున్న వ్యవసాయమే అంటున్నారు. 'కారు' అంత పరిమాణంలో ఉండే రెండు ఉపగ్రహాల సాయంతో ఈ అధ్యయనం చేశారు. సహజంగా భూగర్భజలం నిండే ప్రక్రియకన్నా మనం దానితోడి వాడే వేగమే ఎక్కువ. అందువల్ల ఇటువంటి దుష్పరిణామం ఏర్పడింది అని నిపుణులు అంటున్నారు. ఈ సమస్య మరింత జటిలం కానుంద నీ వాళ్ళు హెచ్చరిస్తున్నారు. వాతావరణంలో మార్పులు కూడా ఇందుకు ఒక కారణం. రానున్న రోజులలో భూగర్భ నీటిమట్టం మరింత దిగజారుతుందని వీరు ఆందోళనపడుతున్నారు.

No comments:

Post a Comment