Sunday 25 March 2012

‘కూల్‌డ్రింక్స్’తో జాగ్రత్త..

వే సవి ఎండలు మండుతుంటే శీతల పానీయాలతో గొంతు తడుపుకుని సేద తీరాలని అందరూ భావిస్తారు. మరీ ఎక్కువగా కూల్‌డ్రింక్స్ తాగితే మొదటికే మోసం వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విషయమై ఇటీవల హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు లోతుగా అధ్యయనం చేసి కొత్త విషయాలను ఆవిష్కరించారు. ప్రతిరోజూ కూల్‌డ్రింక్ తాగేవారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వీరు తేల్చారు. కాగా, వారానికోసారి శీతల పానీయం తాగేవారి పరిస్థితి మెరుగ్గానే ఉంటుందని చెబుతున్నారు. కూల్‌డ్రింక్స్‌లోని తీపి పదార్థాలు రక్తంలో కొవ్వు పెరగడానికి కారణమవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ కొవ్వు కారణంగా గుండెపై వత్తిడి అధికమవుతుంది. శీతల పానీయాల వల్ల శరీరం బరువు కూడా పెరుగుతోందంటున్నారు. అధిక బరువు వల్ల అనేక ఇతర జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. వేసవి తాపం నుంచి బయటపడేందుకు, గుండెజబ్బుల బారిన పడుకుండా నిమ్మరసం, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి తాగడం ఎంతో మేలని వారు చెబుతున్నారు.

No comments:

Post a Comment